RIP Tishaa Kumar: టీ సిరీస్‌ ఇంట విషాదం.. 20 ఏళ్లకే మృతి

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:56 PM

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత క్రిషన్‌ కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె తిషాకుమార్‌ (20) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది.

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత క్రిషన్‌ కుమార్‌ (Krishan kumar) ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె తిషాకుమార్‌ (Tishaa kumar) 20) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. గురువారం ఆమె మృతి చెందినట్లు నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ అధికారికంగా వెల్లడించింది. ‘‘అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం చేసిన తిషా మరణించింది. మా కుటుంబానికి ఇది క్లిష్ట సమయం. కాబట్టి, దయచేసి మా గోప్యతను గౌరవించాలని మేము కోరుతున్నాం’’ అని పేర్కొంది. టీ సిరీస్‌ వ్యవస్థాపకుల్లో  ఒకరైన గుల్ష్షన్‌ కుమార్‌ సోదరుడే క్రిషన్‌ కుమార్‌. బాలీవుడ్‌లో పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ సంస్థలో నిర్మితమైన పలు చిత్రాల ప్రీమియర్స్‌కు తిషా హాజరయ్యారు. (Tishaa kumar Passes away).

గతేడాది విడుదలైన ‘యానిమల్‌’ ప్రీమియర్‌ షోలో భాగంగా చివరిసారి ఆమె కెమెరా ముందు కనిపించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారని.. చికిత్స పొందుతూ జర్మనీలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. బాలీవుడ్‌ ప్రముఖులు చాలామంది క్రిషనకుమార్‌ కుటుంబానికి సోషల్‌ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 05:59 PM