Stree 2: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే ఇలా ఉంటే... మరి విడుదలయ్యాక..!

ABN , Publish Date - Aug 12 , 2024 | 04:00 PM

రాజ్‌కుమార్‌ రావు(rajkumar Rao), శ్రద్థా కపూర్‌ జంటగా అమర్‌కౌశిక్‌ (AMar kaushik) తెరకెక్కించిన కామెడీ హారర్‌ చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2) ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల  ముందుకురానుంది.



రాజ్‌కుమార్‌ రావు(rajkumar Rao), శ్రద్థా కపూర్‌ జంటగా అమర్‌కౌశిక్‌ (AMar kaushik) తెరకెక్కించిన కామెడీ హారర్‌ చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2) ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల  ముందుకురానుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హిందీలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో స్టార్‌ హీరోలను ఈ చిత్రం దాటేసింది. తాజాగా  ‘స్త్రీ 2’  (Shraddha Kapoor) సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా.. బాలీవుడ్‌లో ‘ఫైటర్‌’, ‘కల్కి  2898 ఏడీ’ల అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కలెక్షన్లను ఈ సినిమా క్రాస్‌ చేసింది. ఇప్పటివరకు రూ.20 కోట్లకు పైగా వచ్చినట్లు చిత్ర బృందం పేర్కొంది. తొలిరోజు కలెక్షన్లు కూడా ఈ సినిమాలను దాటేయడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌లో ఆగస్టు 15న విడుదల కానున్న చిత్రాలన్నిటి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కంటే ‘ ‘స్త్రీ 2’ కే ఎక్కువ రావడం విశేషమని అంటున్నారు.  భయపడుతూనే హాయిగా నవ్వించే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. 2018లో వచ్చిన  ‘స్త్రీ 2’  మూవీకి ఇది సీక్వెల్‌.  ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్‌ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.  అభిమానుల కోసం ఆగస్టు 14న ప్రత్యేక ప్రివ్యూ షోలను ప్రదర్శిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Updated Date - Aug 12 , 2024 | 04:01 PM