Shraddha Kapoor: 'స్త్రీ 2’ లేటెస్ట్‌ న్యూస్‌ ఇదే!

ABN , Publish Date - Oct 19 , 2024 | 06:53 PM

ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కోట్లల్లో వసూళ్లు రాబట్టిన చిత్రం 'స్త్రీ 2’. శ్రద్థా కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావు జంటగా నటించారు.

ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కోట్లల్లో వసూళ్లు రాబట్టిన చిత్రం 'స్త్రీ 2’. శ్రద్థా కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావు జంటగా నటించారు. ఈ సినిమా విజయం శ్రద్ధాకపూర్‌ (Shraddha Kapoor) మాట్లాడారు. కథ వినగానే ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పిన ఆమె వెంటనే ఓకే చేశానన్నారు.  ఇంకా చెబుతూ ‘స్త్రీ ’ చూసినప్పుడు ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదే అనిపించింది. దాని సీక్వెల్‌ కోసం నన్ను సంప్రదించగానే ఆశ్చర్యపోయా. చాలా మంచి వినోదాత్మక చిత్రం. మొదటి భాగానికి మించిన ఆదరణ ‘ స్త్రీ  2’ సినిమాకు లభించింది. దీన్ని ఇంత గొప్పగా తెరకెక్కించినందుకు దర్శక నిర్మాతలను అభినందించాలి. ఈ విజయం మా టీమ్‌ అందరికీ సొంతం. మంచి  స్క్రిప్ట్ కు వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. మూడో పార్ట్‌లో దీనికి మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అందులో చాలా డెవలప్‌మెంట్స్‌ చేశారు’’ అని అన్నారు.

  Stree-2.jpg

2018లో శ్రద్థాకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘ స్త్రీ ’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. హారర్‌ కామెడీగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న బాక్సాఫీసు ముందుకొచ్చింది. చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకునేలోగా ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట. ఈ సమస్యను విక్కీ (రాజ్‌ కుమార్‌ రావ్‌), రుద్ర (పంకజ్‌ త్రిపాఠి), జన (అభిషేక్‌ బెనర్జీ), బిట్టు (అపర్‌ శక్తి )తో పాటు శ్రద్థా కపూర్‌ ఎలా ఎదుర్కొంటారు? అన్న కథాంశంతో తెరకెక్కిన ‘ స్త్రీ  2’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే!  

Updated Date - Oct 19 , 2024 | 06:54 PM