Samantha: మరో సిరీస్‌కు శ్రీకారం.. ఎవరితో.. ఎలా అంటే!

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:02 AM

గత రెండేళ్లగా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత (Samantha) సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. అంత ఇబ్బందిలోనూ 'శాకుంతలం’, ఖుషి’ (Kushi)చిత్రాలు పూర్తి చేసి నటిగా మెప్పించింది

Samantha: మరో సిరీస్‌కు శ్రీకారం.. ఎవరితో.. ఎలా అంటే!

గత రెండేళ్లగా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత (Samantha) సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. అంత ఇబ్బందిలోనూ 'శాకుంతలం’, ఖుషి’ (Kushi)చిత్రాలు పూర్తి చేసి నటిగా మెప్పించింది. అలాగే బాలీవుడ్‌ సిరీస్‌ సిటాడెల్‌ (Citadel)పూర్తి చేసింది.  ఆ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని విదేశాల్లో ట్రీట్‌మెంట్‌కు  వెళ్ళింది.  కొంతకాలం  విశ్రాంతి తీసుకున్న సమంత మళ్లీ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ‘సిటాడెల్‌:హనీ బన్నీ’తో తనలోని యాక్షన్‌ కోణాన్ని రుచి చూపించడానికి సిద్థమవుతుంది. అలాగే తన సొంత బ్యానర్‌ 'ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ నిర్మాణంలో సమంత కీలక పాత్రధారిగా 'మా ఇంటి బంగారం’ (Maa inti Bangaram)చిత్రం తీయనుంది.

Adithya-roy.jpg

తాజాగా సమంతకు సంబంధించి మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పుడామె మరో కొత్త వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమెతో కలిసి బాలీవుడ్‌ కథానాయకుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌ (Aditya Roy Kapur) నటిస్తున్నట్లు సమాచారం. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’ సిరీస్‌ల కోసం రాజ్‌ అండ్‌ డీకేలతో కలిసి పని చేసిన సమంత  మరోసారి తన రాబోయే ప్రాజెక్టు కోసం వారితో కలిసి పని చేయనుంది. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వచ్చే సీక్వెన్స్‌ కోసం ఇప్పటికే ఆదిత్య, సమంత కసరత్తులు కూడా మొదలుపెట్టారు. దీనికి ‘రక్తబీజ్‌’ అనే టైటిల్‌ అనుకున్నట్లు సమాచారం. ఆగస్ట్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. 

Sam.jpg

Updated Date - Jun 29 , 2024 | 10:08 AM