Rana Naidu: రానాకు పురస్కారం... అందుకున్న దర్శకుడు!

ABN , Publish Date - Jul 20 , 2024 | 10:52 AM

రానా(Rana), వెంకటేశ్‌(Venkatesh) కీలక పాత్రలు పోషించిన ‘రానా నాయుడు’ (Rana naidu)వెబ్‌సిరీస్‌ ఓటీటీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే!

రానా(Rana), వెంకటేశ్‌(Venkatesh) కీలక పాత్రలు పోషించిన ‘రానా నాయుడు’ (Rana naidu)వెబ్‌సిరీస్‌ ఓటీటీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే! ఇప్పటికే ఈ సిరీస్‌ పలు అవార్డులు అందుకుంది. తాజాగా ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును పొందారు. ‘ఇండియన్‌ టెలీ అవార్డు 2024’లో ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. రానా తరఫున ఈ అవార్డును సిరీస్‌ డైరెక్టర్‌ అందుకున్నారు. దీనిపై నటుడు స్పందిస్తూ.. ఈ పురస్కారానికి ఎంపిక కావడం గౌరవంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు రానాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ana naidu.jpg

ఇటీవల రానా ఈ సిరీస్‌ గురించి మాట్లాడతూ "నేను ఎప్పుడూ మంచి కథలపైనే దృష్టి పెడతానన్నారు. ఈ సిరీస్‌ ఒక కుటుంబంలో జరిగిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా దీన్ని తెరకెక్కించారు దర్శకుడు. సిరీస్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా నెట్‌ఫ్లిక్స్‌లో చరిత్ర సృష్టించింది. గ్లోబల్‌ స్థాయిలో ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న సిరీస్‌లో ఇది టాప్‌లో ఉంది’’ అన్నారు. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ రూపొందింది. దీని కోసం రానా, వెంకటేశ్‌ మొదటిసారి స్క్రీన్   షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కింంది. వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. తాజాగా దీనికి సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. మరెన్నో ట్విస్టులు, ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ త్వరలో విడుదల కానున్నట్లు తెలిపింది.

Rana-award.jpg

Updated Date - Jul 20 , 2024 | 10:55 AM