Jackky Bhagnani: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్తకు ఏమైంది.. జీతాలు ఇవ్వడం లేదట!

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:02 PM

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానికి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ వివాదంలో చిక్కుకుంది. తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ.. ఆ సంస్థలో పనిచేసిన సిబ్బందే ఇప్పుడు ఆరోపణలు చేస్తుండటంతో.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వివాదంలోకి చేరింది. ఈ సంస్థలో పనిచేసిన సిబ్బంది సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. తమకు రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Jackky Bhagnani: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్తకు ఏమైంది.. జీతాలు ఇవ్వడం లేదట!
Producer Jackky Bhagnani

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh ) భర్త జాకీ భగ్నాని (Jackky Bhagnani)కి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ (Pooja Entertainment) వివాదంలో చిక్కుకుంది. తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ.. ఆ సంస్థలో పనిచేసిన సిబ్బందే ఇప్పుడు ఆరోపణలు చేస్తుండటంతో.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వివాదంలోకి చేరింది. ఈ సంస్థలో పనిచేసిన సిబ్బంది సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. తమకు రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read-Jr NTR: తారక్‌ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూశారా?

ఈ సంస్థలో పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్ మాట్లాడుతూ.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ మధ్యకాలంలో చేసిన ఓ సినిమాకు భారీ బడ్జెట్ అయిందని, అందువల్లే వేతనాలు చెల్లించలేకపోతున్నామని సదరు నిర్మాణ సంస్థ తెలిపినట్లుగా వెల్లడించారు. దాదాపు ఏడాది నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని, మా పరిస్థితి దయనీయంగా మారడం వల్లే ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైన్‌కు చెందిన ఓ వర్కర్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సంస్థలో 100 మంది సిబ్బందితో కలిసి ఓ ప్రాజెక్ట్‌కు పనిచేశానని, రెండు నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అదే ప్రాజెక్ట్‌కు పనిచేసిన నటీనటులందరికీ రెమ్యునరేషన్స్ ఇచ్చారు కానీ.. తమకు మాత్రం జీతాలు ఇవ్వకుండా ఏవేవో సాకులు చెబుతున్నారని తెలిపిన ఆమె.. నేను కష్టపడి చేసిన పనికి నాకెప్పుడు డబ్బు వస్తుంది అంటూ సంస్థను పబ్లిగ్గా ప్రశ్నించింది. (Pooja Entertainment in Controversy)


Rakul-Couple.jpg

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు సంబంధించిన నిర్మాణ సంస్థ వార్తలలో హైలెట్ అవుతోంది. మరి ఈ ఆరోపణలపై సదరు సంస్థ యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ చివరిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో ‘బడే మియా ఛోటే మియా’ (Bade Miyan Chote Miyan) అనే చిత్రాన్ని నిర్మించింది.

Read Latest Cinema News

Updated Date - Jun 22 , 2024 | 10:02 PM