Kangana Ranaut: అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను?

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:02 PM

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్  ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా  చెబుతుంటారు. ఎన్నో సందర్భాల్లో బాలీవుడ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తాజా ఇంటర్వ్యూలోనూ ఆ చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్  (Kangana Ranut) ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా  చెబుతుంటారు. ఎన్నో సందర్భాల్లో బాలీవుడ్‌పై (Bollywood fire brand) అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె తాజా ఇంటర్వ్యూలోనూ ఆ చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు (Kangana comments) చేశారు. బాలీవుడ్‌లో మీకు ఫ్రెండ్స్‌ ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నేను బాలీవుడ్‌కు సెట్‌ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ స్నేహితులు లేరు. వాళ్లందరి లైఫ్‌ స్టైల్‌ వేరు. నాది వేరు. షూటింగ్స్‌ లేకపోతే.. ఉదయం జిమ్‌ చేయడం, మధ్యాహ్నం నిద్రపోవడం, మళ్లీ సాయంత్రం కసరత్తులు చేయడం, టీవీ చూడడం, పడుకోవడం ఇదే వారి దినచర్య. అంతకుమించి వారికేం తెలియదు. అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను?  సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ల దుస్తులు, విలువైన వస్తువుల గురించే మాట్లాడుకుంటుంటారు తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. వీటికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్‌లో కనిపిస్తే ఆశ్చర్యమే’’ అని వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రీలో జరిగే పార్టీ గురించి మాట్లాడుతూ.. అక్కడ వారు మాట్లాడుకునే మాటలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. నా కోణంలో బాలీవుడ్‌ పార్టీలంటే ‘ఓ ట్రామా’ అని అన్నారు. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ‘ఎమర్జెన్సీ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కంగనా. ఆమె ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమిది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రానున్న ఈ సినిమా సెప్టెంబరు 6న విడుదల కానుంది.

Updated Date - Aug 18 , 2024 | 02:02 PM