Kangana Ranaut: ప్రతిభ గలవారి కెరీర్‌ నాశనం చేయడానికే చూస్తారు!

ABN , Publish Date - Aug 28 , 2024 | 04:12 PM

బాలీవుడ్‌ను ఉద్దేశించి నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభ గల వారికి ఇక్కడ ఎలాంటి గుర్తింపు దక్కదని అన్నారు.

బాలీవుడ్‌ను ఉద్దేశించి నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభ గల వారికి ఇక్కడ ఎలాంటి గుర్తింపు దక్కదని అన్నారు. కనీసం ప్రోత్సహించేవారు కూడా ఉండరని ఆమె వ్యాఖ్యానించారు(Kangana Comments on Bollywood). ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నానని, పలు కారణాలతో తనను బహిష్కరించారని కంగనా పేర్కొన్నారు. ‘‘నా వరకూ నేను మంచి వ్యక్తినే. నా చుట్టూ ఉన్న వారితో మర్యాదపూర్వకంగా ఉంటా. ఎన్నికల్లోనూ విజయం సాధించా.. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానం పొందా. దీనిని బట్టి చూస్తే నాతో కొంతమందికి మాత్రమే సమస్య ఉంది. ఆ సమస్య నాలో ఉందా? లేదా వారిలో ఉందా? అనేది వారు కూడా ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. నా దృష్టిలో బాలీవుడ్‌ అనేది ఒక నిస్సహాయ ప్రదేశం. ఈ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు మనకు ఎలాంటి సాయం చేయరు. ప్రతిభను చూసి సదరు జనాలు అసూయ పడతారు. ఎవరైనా టాలెంట్‌ ఉన్న వ్యక్తులు తమ దృష్టిలో పడితే తప్పకుండా వారి కెరీర్‌ నాశనం చేయడానికి రకరకాల ప్లాన్స్‌ వేస్తుంటారు. పీఆర్‌లను నియమించి వారిపై దారుణంగా అవాస్తవాలు ప్రచారం చేయిస్తారు. ఇండస్ర్టీ వారిని బహిష్కరించేలా పరిస్థితులు సృష్టిస్తారు’ అని కంగనా రనౌత్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి.

ప్రస్తుతం కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారామె. తన కెరీర్‌, బాలీవుడ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తనపై కుట్ర జరిగిందని చె్క్ష?్పరు. తన సినిమాల్లో యాక్ట్‌ చేయొద్దని చాలా మందికి చెప్ప్పారని ఆరోపించారు.

Updated Date - Aug 28 , 2024 | 04:13 PM