Emergency - Kangana: అందుకే.. చీకటి రోజున ప్రకటిస్తున్నాం!

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:06 PM

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). కొంతకాలంగా విడుదల వాయిదా పడుతున్న ఈ చిత్రం త్వరలో థియేటర్స్‌లో సందడి చేయనుంది.

Emergency - Kangana: అందుకే.. చీకటి రోజున ప్రకటిస్తున్నాం!


బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). కొంతకాలంగా విడుదల వాయిదా పడుతున్న ఈ చిత్రం త్వరలో థియేటర్స్‌లో సందడి చేయనుంది. హీరోయిన్ కంగనా విడుదల తేదీని ప్రకటించారు. ‘దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అందుకే ఆ చీకటి రోజులకు సంబంధించిన ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటిస్తున్నా’ అంటూ సెప్టెంబర్‌ 6న ఎమర్జెన్సీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. ‘మణికర్ణిక’ తర్వాత కంగనా దర్శకత్వం వహించిన సినిమా ఇది. కాబట్టి ఎమర్జెన్సీ కంగనాకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌. దీని కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. మొదట ఈ సినిమాను గతేడాది నవంబర్‌ 24న విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత జూన్‌ 14కు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని పనులు పూర్తికావడంతో సెప్టెంబర్‌ 6ను ఫిక్స్‌ చేశారు. కంగనా రాజకీయాలతో బిజీ కావడం కూడా విడుదల వాయిదాకు ఓ కారణంగా నిలిచింది. (Emergency on 6Th Septeber)


ఈ సినిమా కోసం తనకు సంబంధించిన ఆస్తులను తనఖా పెట్టినట్లు కంగనా ఓ సందర్భంలో చెప్పారు. అలాగే  మొదటి షెడ్యూల్‌ సమయంలో డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య  భారీగా పడిపోయినా షూట్‌లో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పడే కనిపించనున్నారు.ఈ చిత్రానికి కంగనా నిర్మాతగానూ వ్యవహరించారు.

Updated Date - Jun 25 , 2024 | 01:33 PM