Janhvi Kapoor: నాపై దారుణమైన ట్రోలింగ్‌ అది!

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:53 AM

ఇన్స్టా గ్రామ్‌ మినహా మరే సోషల్‌మీడియా అకౌంట్‌లో తను యాక్టివ్‌గా ఉండనని జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చెప్పిన సంగతి తెలిసిందే! రెడిట్‌లో కూడా యాక్టివ్‌గా లేనని అందులో జరిగే విషయాలను తన సోదరి ఖుషీ కపూర్‌ (kushi kapoor) చెబుతుందని వివరించింది.

ఇన్స్టా గ్రామ్‌ మినహా మరే సోషల్‌మీడియా అకౌంట్‌లో తను యాక్టివ్‌గా ఉండనని జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) చెప్పిన సంగతి తెలిసిందే! రెడిట్‌లో కూడా యాక్టివ్‌గా లేనని అందులో జరిగే విషయాలను తన సోదరి ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) చెబుతుందని వివరించింది. తనపై సోషల్‌ మీయా వెబ్‌సైట్‌ రెడిట్‌లో వచ్చే ట్రోల్స్‌ గురించి తన సోదరి చెప్పేవరకు తెలియదని మరోసారి తెలిపింది. జాన్వీ కపూర్‌ నటించిన తాజా చిత్రం ‘ఉలఝ్‌’ (Ulajh). జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా తెరకెక్కించారు. జాన్వీ ఇందులో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణిగా కనిపించనుంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌లో గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. 

Janhvi.jpg

‘నాకు సోషల్‌ మీడియా అంటే భయం. అందుకే దానికి దూరంగా ఉంటాను. ‘రెడిట్‌లో చాలా మంది నిన్ను ట్రోల్‌ చేస్తున్నారు అక్క’ అని ఖుషీ చెప్పే వరకు నాకు తెలియదు. వాటిని చూశాక ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అందులో దారుణమైన ట్రోల్స్‌ కూడా ఉన్నాయి. వాటిని నేను పట్టించుకోను’ అని అన్నారు. గతంలోనూ జాన్వీ ఆన్‌లైన్‌ వేదికగా స్టార్‌ కిడ్స్‌ ఎదుర్కొంటున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సోషల్‌మీడియా కల్చర్‌ అది. నువ్వు పబ్లిక్‌ ఫిగర్‌ అయినా, కాకపోయినా ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆ కామెంట్స్‌కు ఇంపార్టెన్స్  ఇవ్వడం, వాటిని మైండ్‌కి తీసుకోవలసిన అవసరం లేదు. ఈరోజు పొగిడిన వాళ్లే.. రేపు తిడతారు. మనకు తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు’’ అని అన్నారు.

Janhvi-2.jpg

అంతే కాదు ఇటీవల నటుడు గుల్షన్  దేవయ్య కూడా జాన్వీపై కామెంట్స్‌ చేశాడు. సెట్స్‌లో ఆమె అసలు పట్టించుకోదని, అంతగా మాట్లాడదని చేసిన కామెంట్లపై జాన్వీ స్పందించడంతో ఆమెకు క్షమాపణ చెప్పాడు. జాన్వీ ప్రస్తుతం తెలుగులో కూడా బిజీ అవుతోంది. ఎన్టీఆర్‌ సరసన 'దేవర' చిత్రంలో నటిస్తోంది. తదుపరి  రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న చిత్రంలో కథానాయికగా అవకాశం అందుకొంది. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Updated Date - Aug 03 , 2024 | 11:57 AM