Janhvi kapoor: ఈరోజు పొగిడిన వాళ్లే.. రేపు తిడతారు

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:02 AM

ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జాన్వీకపూర్‌ కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల్లోనే మళ్లీ యాక్టివ్‌ అయ్యా వరుస ప్రమోషన్లో పాల్గొంటున్నారు.

ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన జాన్వీకపూర్‌ (Janhvey kapoor) కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల్లోనే మళ్లీ యాక్టివ్‌ అయ్యా వరుస ప్రమోషన్లో పాల్గొంటున్నారు. తన తదుపరి చిత్రం ‘ఉలఝ్‌’ చిత్రం విడుదల నేపథ్యంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్‌మీడియా ట్రోల్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆన్‌లైన్‌ వేదికగా స్టార్‌కిడ్స్‌ (Star kids) ఎదుర్కొంటున్న విమర్శలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాటిని పట్టించుకోవడం కూడా వృథా. ఎందుకంటే, సోషల్‌మీడియా కల్చర్‌ అది. నువ్వు పబ్లిక్‌ ఫిగర్‌ అయినా, కాకపోయినా ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కామెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక విషయంలో ఈరోజు పొగిడినవాళ్లే అదే విషయంపై రేపు తిడతారు. ముక్కూ, మొఖం తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం దేనికి?. మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి’’ అని అన్నారు. అనంతరం అనంత్‌ అంబానీ సతీమణి రాధిక మర్చంట్‌ కోసం  పార్టీ ఇవ్వడంపైజాన్వీ మాట్లాడారు. ‘‘రాధిక నాకు మంచి ఫ్రెండ్‌. తను మాతో చాలా సరదాగా ఉంటుంది. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అందుకే, వివాహానికి ముందు ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటుచేయాలని ఫ్రెండ్స్‌ అందరం అనుకున్నాం. అందులో  భాగంగా గ్రాండ్‌ పార్టీ ఇచ్చాం. తను చాలా సంతోషించింది’’ అని చెప్పారు. 

Updated Date - Jul 22 , 2024 | 11:04 AM