Samantha: ఇది మయోసైటిస్‌ చికిత్సలో భాగమా.. నెటిజన్ల ప్రశ్న?

ABN , First Publish Date - 2023-07-27T14:05:03+05:30 IST

టాలీవుడ్‌ అగ్ర తార సమంత ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన ఆమె చికిత్స కోసం విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమంత చికిత్స పొందుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఆ విషయాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Samantha: ఇది మయోసైటిస్‌ చికిత్సలో భాగమా.. నెటిజన్ల ప్రశ్న?

టాలీవుడ్‌ అగ్ర తార సమంత(Samantha) ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన ఆమె చికిత్స కోసం విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమంత చికిత్స పొందుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది(Naturopathy). ఆ విషయాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. అక్కడి జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోలు షేర్‌ చేసింది. అంతే కాదు మరో ఫొటోతో ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్‌బాత్‌ చేసినట్లు పేర్కొంది. సంబంధిత ఫొటోలు షేర్‌ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు ‘ఈ ఐస్‌బాత్‌ థెరపీ (Ice bath) మయోసైటిస్‌ చికిత్సలో ఓ భాగమా..?’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, గతంలో కూడా సమంత ఇలా చేశారు. ఐస్‌ గడ్డలు ఉన్న టబ్‌లో కూర్చున్న ఫొటోను షేర్‌ చేసి ‘ఈ ఐస్‌ బాత్‌ రికవరీ టైమ్‌ ఎంతో బాధపెడుతోంది’’ అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే! ఏడాదిపాటు ఆమె మయోసైటిస్‌కు చికిత్స పొందుతుందని తెలుస్తోంది. (Samantha ICe bath)

22.jpg

ప్రస్తుతం ఆమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ సిననిమా షూటింగ్‌ పూర్తి చేసింది. సెప్టెంబరు 1న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘సిటడెల్‌’ వెబ్‌సిరీస్‌ను కూడా సమంత పూర్తి చేసింది. ఇది కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-07-27T14:05:40+05:30 IST