Mahesh Babu: మహేష్ బాబు ఫోటోస్ వైరల్, ఇందుకేనా...

ABN , First Publish Date - 2023-11-08T13:07:50+05:30 IST

మహేష్ బాబు తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. ఇంతకీ ఈ ఫోటోలు ఎందుకు వైరల్ అవుతున్నాయంటే...

Mahesh Babu: మహేష్ బాబు ఫోటోస్ వైరల్, ఇందుకేనా...
Mahesh Babu still from Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) 13 ఏళ్ళ విరామం తర్వాత 'గుంటూరు కారం'తో #GunturKaaram కలిసి వస్తున్నారు. ఇంతకు ముందు 'అతడు', ,ఖలేజా, వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కావటంతో ఇంకొక చిరస్మరణీయ సినిమా వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 'గుంటూరు కారం' చిత్రానికి నిర్మాత ఎస్.రాధాకృష్ణ (SuryadevaraRadhakrishna) కేవలం త్రివిక్రమ్ సినిమాల కోసమే మొదలు పెట్టిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

maheshbabupicistrending.jpg

ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి, అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన సమాచారం రెగ్యులర్ గా ఇవ్వాలని పదే పదే కోరుతున్నారు. అందులో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ టీజర్ తర్వాత, 'గుంటూరు కారం' నుండి మొదటి పాట విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో మంచి అల్బంలను అందించిన ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

maheshbabugunturkaarampicis.jpg

ఇప్పుడు మొదటి పాటగా ఈ సినిమాకి 'దమ్ మసాలా' #Dum Masala లాంటి ఒక మసాలా పాటతో దీపావళిని జరుపుకోవాలని మేకర్స్ నిర్ణయించి ఈ పాటను దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలుపుతోంది.

థమన్ (SThaman) అందించిన ట్యూన్, బీట్ సరికొత్తగా ఉన్నాయి. "నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి", "నేనో నిశబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం" వంటి పంక్తులతో గీత రచయిత పాత్రలోని లోతును ఆవిష్కరించారు. సంచలన నటి శ్రీలీల (Sreeleela) ఈ చిత్రంలో మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది.

mahesbabutrivikramgunturkaa.jpg

ఇంకా మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary), జగపతి బాబు (JagapathiBabu), జయరామ్, ప్రకాష్ రాజ్ (PrakashRaj), రమ్య కృష్ణ (RamyaKrishna) వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు.ఈ సినిమా 2024, సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సినిమానుండి కొన్ని మహేష్ బాబు ఫోటోస్ కూడా ఈ సందర్భంగా చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-11-08T13:07:51+05:30 IST