Adipurush: దర్శకుడు ఓం రౌత్ ని, డైలాగ్ రైటర్ ని చంపేస్తాం: రాజ్ షేఖావత్ కర్ని సేన

ABN , First Publish Date - 2023-06-19T15:50:18+05:30 IST

'ఆదిపురుష్' సినిమా ఇప్పుడు ఇంకో కొత్త వివాదానికి దారితీసింది. దేశంలో ప్రజలు ముక్త కంఠంతో ఈ సినిమా మీద విమర్శలు గుప్పిస్తుంటే, క్షత్రియ కర్ని సేన ఈ సినిమా దర్శకుడు, మాటల రచయితని కనిపిస్తే చంపేస్తాం అని హెచ్చరికలు జారీ చేసింది

Adipurush: దర్శకుడు ఓం రౌత్ ని, డైలాగ్ రైటర్ ని చంపేస్తాం: రాజ్ షేఖావత్ కర్ని సేన
Adipurush

ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన పౌరాణిక సినిమా 'ఆదిపురుష్' #Adipurush మొదటి రోజు నుండే వివాదాల్లో కూరుకుపోయింది. ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వహించిన ఈ సినిమా, రామాయణం (Ramayanam) ఆధారంగా తీసినది అని చెప్పారు. అయితే సినిమా చూసిన వాళ్లంతా ఇందులో రాముడు, సీత, లక్ష్లనుడు, రావణుడు, అలాగే మిగతా పాత్రలు అవి మలిచిన తీరు ఎంతో వివాదాస్పదం అయ్యాయి. ఇది ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో మాటలు కూడా ఇంకో వివాదానికి కారణం అయ్యాయి.

Prabhas.jpg

ఒక్క హిందీ భాషలోనే కాకుండా తెలుగులో విడుదల అయిన సినిమాలో అయితే మరీ తెలంగాణ యాస వచ్చేట్టు కూడా పెట్టేసారు. ఒక్క మాట కూడా వినసొంపుగా లేకుండా, తనకి ఇష్టమొచ్చిన రీతిలో రాసేశారు అనే విమర్శ వచ్చింది సర్వత్రా. అలాగే ఈ సినిమాని ప్రభాస్ అభిమానులతో సహా, చాలామంది ప్రేక్షకులు బాగోలేదని, కథ అంత తప్పుల తడక అని, ప్రభాస్ లాంటి స్టార్ తో ఇలాంటి చెత్త సినిమా తీస్తాడా ఓం రౌత్ అని ప్రేక్షకుల మండిపడుతున్నారు.

కొంతమంది ఈ సినిమాను ఆపాలని కోర్టులను కూడా ఆశ్రయించారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్, అలాగే మాటల రచయిత అయిన మనోజ్‌ని (Manoj Muntashir) చంపేస్తామని క్షత్రియకర్ని హెచ్చరించింది. ఆ సేన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ షేకావత్ (Raj Shekhawat) మధ్యప్రదేశ్ లోని బియోరాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. "మా సేన కి చెందిన వాళ్ళు దర్శకుడు ఓం రౌత్, మాటల రచయిత మనోజ్ కోసం చూస్తున్నారు. వాళ్ళు బయట కనిపించిన మరుక్షణం వాళ్లిద్దరూ చచ్చిపోతారు," అని హెచ్చరిక జారీ చేశారు.

Updated Date - 2023-06-19T15:50:18+05:30 IST