vijay kiragandur: కాంతార-2 క్లారిటీ వచ్చింది!

ABN , First Publish Date - 2023-01-22T13:46:22+05:30 IST

తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’. రూ.16 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది.

vijay kiragandur: కాంతార-2 క్లారిటీ వచ్చింది!

తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’(Kanthara). రూ.16 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కాంతార 2’(Kanthara 2) తెరకెక్కనుంది. చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఇది సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా( Not Sequel) (Kanthara is prequel)ఉండబోతుందని స్పష్టతనిచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రణాళిక మొత్తం పూర్తయింది. దర్శకుడు, హీరో రిషబ్‌ శెట్టి ఇప్పటికే ఆ పనులు మొదలుపెట్టారు.(Shoot from june) జూన్‌లో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. కొన్ని సన్నివేశాలు వర్షాకాలంలో నేపథ్యంలో ఉండనున్నాయి. అందుకే ఆ నెల నుంచే చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని చేయాలనుకుంటున్నాం. తొలి భాగం కథ ఎక్కద మొదలయిందో దానికి ముందు కథను తెరకెక్కించనున్నారు.

Updated Date - 2023-01-22T13:46:23+05:30 IST