VijayDeverakonda: ఈసారి మృణాల్ ఠాకూర్ తో, రేపు పూజ

ABN , First Publish Date - 2023-06-13T12:03:19+05:30 IST

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల మరోసారి కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికారికంగా రేపు పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అని తెలిసింది. ఇందులో 'సీత రామం' సినిమాలో సీత పాత్రలో మెప్పించిన మృణాల్ కథానాయికగా చేస్తోంది.

VijayDeverakonda: ఈసారి మృణాల్ ఠాకూర్ తో, రేపు పూజ
Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), దర్శకుడు పరశురామ్ పెట్ల (ParasuramPetla) ఇద్దరూ కలిపి 'గీత గోవిందం' #GeethaGovindam అనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ (AlluAravind) ఆ సినిమా ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ విజయ్, పరశురామ్ చేతులు కలిపారు, అయితే ఈసారి దిల్ రాజు (DilRaju) నిర్మాత. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రేపు దిల్ రాజు ఆఫీస్ లో జరగనున్నాయని తెలిసింది.

mrunalthakur7.jpg

ఈ సినిమాలో తెలుగులో 'సీత రామం' #SitaRamam తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన కథానాయిక మృణాల్ ఠాకూర్ (MrunalThakur), విజయ్ దేవరకొండ పక్కన నటిస్తోంది అని తెలిసింది. ఈ సినిమా రేపు అధికారికంగా పూజ కార్యక్రమాలతో మొదలవుతుందని విజయ్ టీము మెంబెర్స్ చెపుతున్నారు. మృణాల్ ఠాకూర్ తన నటనతో సీత పాత్రలో ప్రేక్షకులని మెప్పించింది. ఆమె నాని (Nani) తో కూడా ఒక సినిమా చేస్తోంది, ఇప్పుడు తెలుగులో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది అవుతుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఖుషీ' #Khushi సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకుడు కాగా, సమంత (Samantha) ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో అయిపోవాల్సింది కానీ, సమంత వలన బాగా డిలే అయింది. ఆమెకి మయోసిటిస్ (Myositis) అనే వ్యాధి రావటం, దానివల్ల ఆమె చాలారోజులు మంచం పట్టడం, అందువలన 'ఖుషీ' సినిమా బాగా వెనకపడింది. ఆ సినిమా షూటింగ్ కొనసాగుతోంది, విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఆ సినిమా అయ్యాక, ఈ పరశురామ్ సినిమా మొదలవ్వొచ్చు అని అంటున్నారు.

Updated Date - 2023-06-13T12:03:19+05:30 IST