Ustaad Bhagat Singh: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ ట్వీట్‌ వైరల్‌!

ABN , First Publish Date - 2023-05-04T12:19:40+05:30 IST

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish shankar) మంచి జోరు మీదున్నారు. కాస్త దూకుడు పెంచారు. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad bhagatsingh) తదుపరి షెడ్యూల్‌కు వెళ్లడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

Ustaad Bhagat Singh: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ ట్వీట్‌ వైరల్‌!

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish shankar) మంచి జోరు మీదున్నారు. కాస్త దూకుడు పెంచారు. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad bhagatsingh) తదుపరి షెడ్యూల్‌కు వెళ్లడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. గబ్బర్‌సింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయం తర్వాత పవన్‌కల్యాణ్‌(pawan kalyan)తో ఆయన చేస్తున్న చిత్రమిది. ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌ కుదరడానికి 11 ఏళ్లు పట్టింది. ఇప్పుడు మరింత జోష్‌తో ఈ చిత్రానికి పనిచేస్తున్నారు హరీశ్‌ శంకర్‌. ఏప్రిల్‌ ప్రారంభంలో మొదలైన ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. అందులో హీరో, హీరోయిన్‌ శ్రీలీలపై లవ్‌, రొమాంటిక్‌ సన్నివేశాలు తీశారు. అక్కడితో ఆ షెడ్యూల్‌ పూర్తయింది. తదుపరి పవన్‌కల్యాణ్‌ ‘ఓజి’ సెట్‌లో అడుగుపెట్టారు. మంగళవారంతో ముంబై షెడ్యూల్‌ పూర్తి చేసిన పవన్‌కల్యాణ్‌ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రం సెట్‌లో పాల్గొంటారని తెలిసింది. (ready For Second schedule)

అయితే తాజాగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. హరీశ్‌ శంకర్‌ రెండో షెడ్యూల్‌ ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ దూసుకెళ్లడానికి సిద్దమవుతున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘రెండో షెడ్యూల్‌కు యాక్షన్‌ చెప్పడానికి ఎగ్జైటింగ్‌గా ఉన్నా’ అంటూ మనల్ని ఎవడ్రా ఆపేది’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. రెండో షెడ్యూల్‌ పక్కా యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్టైన సంగతి తెలిసిందే! 11 ఏళ్ల తర్వాత పవన్‌ - హరీశ్‌శంకర్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలుపెట్టారు. ‘గబ్బర్‌సింగ్‌’ పాటలకు దీటుగా ఆయన బాణీలు ఇవ్వడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. ఆయన సరసన హీరోయిన్‌గా శ్రీలీలా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - 2023-05-04T14:40:21+05:30 IST