Rajamouli- SSMB29: ఆ ముగ్గురు స్టార్లు ఎవరు?

ABN , First Publish Date - 2023-07-14T11:41:34+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబుతో చేయబోయే ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రం కథ కసరత్తుల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్ట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చాయని కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ పలు సందర్భాల్లో చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

Rajamouli- SSMB29: ఆ ముగ్గురు స్టార్లు ఎవరు?

దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) ప్రస్తుతం మహేష్‌బాబుతో చేయబోయే ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29)చిత్రం కథ కసరత్తుల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్ట్‌ పనులు ఓ కొలిక్కి వచ్చాయని కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra prasad) పలు సందర్భాల్లో చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. రాజమౌళి దీనికి సంబంధించిన వర్క్‌షాప్‌ కూడా మొదలుపెట్టారని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే!


ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో మహేశ్‌ లుక్‌ ఎలా ఉండాలి? కథానుగుణంగా ఆయన్ని ఎలా చూపిస్తే బావుంటుంది? అభిమానులకు నచ్చేలా, పాత్రకు తగ్గట్లు ఎలా తీర్చిదిద్దాలి అన్న విషయాలపై అన్ని కోణాల్లోనూ రాజమౌళి ఆలోచన చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరో కాకుండా మూడు అత్యంత కీలకమైన పాత్రలు ఉన్నారట. ఆ పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్‌ (Three bollywood Stars) హీరోలకు స్థానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ స్టార్లు ఎవరనేది గోప్యంగా ఉంటారు. అయితే రాజమౌళి సినిమాలో అవకాశం అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి స్టార్‌ అయినా ఓకే అనాల్సిందే! మరి ఆ ముగ్గురు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి మించేలా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది.

Updated Date - 2023-07-14T11:42:21+05:30 IST