Mahesh Babu29: విజయేంద్ర ప్రసాద్‌ ఏం చెప్పారంటే.. అభిమానులకు పండగే!

ABN , First Publish Date - 2023-06-25T11:14:50+05:30 IST

మహేశ్‌బాబు(Mahesh Babu) ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (guntur karam) చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజా షెడ్యూలఖ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఆయన తదుపరి చిత్రాన్ని రాజమౌళి (Rajamouli)డైరెక్ట్‌ చేయబోతున్న విషయం తెలిసిందే! తాజాగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) గురించి కూడా ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Mahesh Babu29: విజయేంద్ర ప్రసాద్‌ ఏం చెప్పారంటే.. అభిమానులకు పండగే!

మహేశ్‌బాబు(Mahesh Babu) ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (guntur karam) చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజా షెడ్యూలఖ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ఆయన తదుపరి చిత్రాన్ని రాజమౌళి (Rajamouli)డైరెక్ట్‌ చేయబోతున్న విషయం తెలిసిందే! తాజాగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) గురించి కూడా ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. విజయేంద్రప్రసాద్‌ (V. Vijayendra Prasad) ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్‌ మీదకెళ్లనున్న ఈ చిత్రం గురించి రచయిత విజయేంద్రప్రసాద్‌ తాజాగా బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘జులైలోపు స్ర్కిప్ట్‌ పనులు పూర్తి చేసి, రాజమౌళికి అందజేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆస్కారం ఉందని క్లైమాక్స్‌ సన్నివేశాలు అందుకు అనుగుణంగా మలచినట్లు తెలిపారు. ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న (SSMB29 Sequel)ఈ చిత్రానికి సీక్వెల్స్‌ కూడా వస్తాయని మొదటి నుంచి టాక్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్‌ తాజాగా ఇచ్చిన సమాచారం ఈ చిత్రానికి సీక్వెల్స్‌ పక్కా అని తెలుస్తోంది.

ఎట్టకేలకు ‘గుంటూరు కారం’ మొదలైంది!

మహేశ్‌ హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రీకరణ శనివారం మొదలైంది. తాజా షెడ్యూల్‌ కోసం మహేశ్‌ రంగంలో దిగారు. హైదరాబాద్‌ శివార్లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు. మహేశ్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. శ్రీలీల ఓ కథానాయిక. మరో నాయికగా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కొంత విరామం తర్వాత చిత్రీకరణ ప్రారంభం కావడంతో వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టినట్లయింది. అభిమానులు ఆనందంలో ఉన్నారు.

Updated Date - 2023-06-25T11:21:02+05:30 IST