Raviteja- Sharwanand: జాతీయ అవార్డు గ్రహీతతో మల్టీస్టారర్‌!

ABN , First Publish Date - 2023-04-21T16:01:55+05:30 IST

మల్లీస్టారర్‌ చిత్రాలు (Multi Starer) చేయడానికి రవితేజ ఎప్పుడూ సిద్ధమే! కథ, క్యారెక్టర్‌ నచ్చితే చాలు ఆయనపచ్చ జెండా ఊపేస్తారు. కెరీర్‌ బిగినింగ్‌లో ఆయన ఇలాంటి ప్రయోగాలు చేశారు.

Raviteja- Sharwanand: జాతీయ అవార్డు గ్రహీతతో మల్టీస్టారర్‌!

మల్లీస్టారర్‌ చిత్రాలు (Multi Starer) చేయడానికి రవితేజ ఎప్పుడూ సిద్ధమే! కథ, క్యారెక్టర్‌ నచ్చితే చాలు ఆయనపచ్చ జెండా ఊపేస్తారు. కెరీర్‌ బిగినింగ్‌లో ఆయన ఇలాంటి ప్రయోగాలు చేశారు. మరో హీరోతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడానికి ఎప్పుడూ వెనకాడలేదు. సంక్రాంతి బరిలో భారీ విజయం అందుకున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవికి (Chiranjeevi)తమ్ముడిగా నటించారు. తాజాగా మరోసారి ఆయన మల్టీస్టారర్‌పై దృష్టిపెట్టారు. యంగ్‌స్టర్‌ శర్వానంద్‌తో కలిసి రవితేజ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని (Ravitea multistarer wih sharwanand) తెలిసింది. అయితే ఈ వార్త చాలారోజులు నెట్టింట చక్కర్లు కొడుతున్నదే. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్‌కు దర్శకుడు, నిర్మాణ ఖరారైనట్లు తెలిసింది. ఇక సెట్స్‌ మీదకు వెళ్ళడమే ఆలస్యమని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

‘కలర్‌ ఫొటో’(Colour photo) తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే జాతీయ పుర్కస్కారం అందుకున్న సందీప్‌ రాజ్‌ రవితేజ, శర్వానంద్‌లను డైరెక్ట్‌ చేయనున్నారు. ఆయన చెప్పిన కథ ఇద్దరు హీరోలనూ మెప్పించిందట. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అవార్డులు, రివార్డులను అందుకొంది. తదుపరి ఆయన దర్శకత్వం వహించేది ఈ మల్టీస్టారరే! అయితే ఈ గ్యాప్‌లో ‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’, ‘ముఖ చిత్రం’ సినిమాలకు సందీప్‌ రాజ్‌ స్ర్కిప్ట్స్‌ అందించారు. జీ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. మొదటి మూడు నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించడానికి పోటీ పడ్డాయట. ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రాజీ పడకుండా నిర్మించడానికి జీ స్టూడియోస్‌ ముందుకు వచ్చిందనీ, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌, స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంతో బిజీగా ఉన్నారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్‌’ సినిమా చేస్తున్నారు. డైరెక్షన్‌లో శర్వానంద్‌ ఓ సినిమా చేస్తున్నారు. హీరోలిద్దరూ ఈ చిత్రాల బిజీ నుంచి బయటపడ్డాక మల్టీస్టారర్‌ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. రవితేజ మరో మల్టీస్టారర్‌ కూడా చేయబోతున్నారని టాక్‌. తమిళంలో హిట్టైన ‘మానాడు’ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో వరుణ్‌ధావన్‌తో రవితేజ స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే వార్త కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - 2023-04-21T16:05:24+05:30 IST