Rashmika Mandanna: శ్రీవల్లి పుష్పరాజ్‌ని మించిపోయింది!

ABN , First Publish Date - 2023-04-16T15:08:40+05:30 IST

ప్యాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’తో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. వరుస చిత్రాలతో కథానాయికగా దూసుకుపోతోంది.

Rashmika Mandanna: శ్రీవల్లి పుష్పరాజ్‌ని మించిపోయింది!

ప్యాన్‌ ఇండియా సినిమా ‘పుష్ప’(Pushpa-2)తో నేషనల్‌ క్రష్‌గా (National crush Rashmika) మారిపోయింది రష్మిక మందన్నా. వరుస చిత్రాలతో కథానాయికగా దూసుకుపోతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా మరో ఘనత దక్కించుకుంది. ఐఎండీబీ (IMDB) ప్రకటించిన ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీ కేటగీరిలో శ్రీవల్లి (SRIVALLI) చోటు సంపాదించుకుంది. ఈ వారం కొత్తగా చేరిన సెలబ్రిటీల జాబితాలో టాప్‌-3లో నిలిచింది. రష్మిక ఈ లిస్టులోకి ఎంట్రీ అవ్వడం ఇదే మొదటిస?రి. ఐఎండీబీ ప్రకటించిన ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీ జాబితాలో అల్లు అర్జున్‌ 17వ స్థానంలో నిలిచారు.

ఇటీవల రష్మిక తన పుట్టినరోజు వేదిక ఘనంగా నిర్వహించుకున్నారు. ‘రెయిన్‌ బో’ అనే ఓ చిత్రం మొదలుపెట్టింది. తదుపరి పుష్ప-2 (Pushpa2) ట్రైలర్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. రష్మిక గురించి ఎక్కువమంది మాట్లాడుకోవడంతో ట్రెండింగ్‌ అయింది. తాజాగా ఐఎండీబీ పాపులర్‌ ఇండియన్‌ (IMDB popular indian list) సెలబ్రిటీ లిస్టులోకి వెట్రిమారన్‌, అల్లు అర్జున్‌, నాని, కీర్తి సురేష్‌, తమన్నా, కరీనా కపూర్‌, సారా అలీ ఖాన్‌ కూడా ఉన్నారు. నాని, కీర్తి సురేశ్‌ దసరా సినిమా హిట్‌ కావడంతో పాపురల్‌ ఇండియన్‌ సెలబ్రిటీగా మారారు.

Updated Date - 2023-04-16T15:13:54+05:30 IST