Rakesh Master: ఐదుగురు మహిళలు దాడికి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-07-08T11:23:15+05:30 IST

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (53)అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాకేష్‌ మాస్టర్‌ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీ వార్తలో నిలిచారు. ఆమెపై పలువురు దాటి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో ఆమెపై ఐదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి దాడికి దిగారు.

Rakesh Master: ఐదుగురు మహిళలు దాడికి కారణం ఏంటంటే..

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (53)అనారోగ్యంతో ఆకస్మికంగా (Rakesh Master) మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాకేష్‌ మాస్టర్‌ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీ (Third wife Lakshmi) వార్తలో నిలిచారు. ఆమెపై పలువురు దాటి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో ఆమెపై ఐదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి దాడికి దిగారు. తను స్కూటర్‌పై వెళ్తుండగా లల్లీ అనే యూట్యూబర్‌ మరో నలుగురు మహిళలు వచ్చి దాడి చేశారు.

నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. దాడి చేసినవారిపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఆ కాసేపటికే లల్లీతో పాటు నలుగురు మహిళలు కూడా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మొదట లక్ష్మినే తమను దూషించిందని వారు కూడా పలు ఆధారాలతో ఆమెపై కేసు పెట్టారు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారించి పంపించేశారు.

లక్ష్మితోపాటు వారందరూ కూడా యూట్యూబ్‌ ఛానల్స్‌ నడుపుతున్నారు. ఇదే విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను రెండు నెలలుగా చంపేస్తామని బెదిరిసున్నారని లక్ష్మీ పోలీసులకు తెలిపింది. వీరందిరకి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి.. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయించిందని ఆమె ఆరోపిస్తుంది. తనకు ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌ను క్లోజ్‌ చేసుకోవాలని కొంతకాలంగా వీరందరూ బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది. దుర్గ, లల్లీ, పెరుగు పెద్దమ్మ, తనపై దాడి చేశారని చెప్పింది.

Updated Date - 2023-07-08T11:54:27+05:30 IST