Racharikam: అరాచకంగా ‘రాచరికం’.. మా టైటిల్ చూసి బోయపాటి గారు మెసేజ్ పెట్టారు

ABN , Publish Date - Dec 18 , 2023 | 06:32 PM

చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రం ‘రాచరికం’. విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించారు.

Racharikam: అరాచకంగా ‘రాచరికం’.. మా టైటిల్ చూసి బోయపాటి గారు మెసేజ్ పెట్టారు
racharikam

చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ (Chill Bross Entertainments) బ్యానర్ పై ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రం ‘రాచరికం’(Racharikam). విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విస్ ఆన్ చేశారు. అనంతరం నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి వెంగి సంగీతాన్ని అందిస్తుండగా, కెమెరా మెన్ గా ఆర్య సాయి కృష్ణ, జేపీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

దర్శకుడు సురేష్ లంకలపల్లి (Suresh Lankalapalli) మాట్లాడుతూ.. ‘చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ మీద రాచరికం (Racharikam) అనే సినిమాను తీస్తున్నాము. ఈ మూవీ గ్లింప్స్ ప్రస్తుతం మంచి రెస్సాన్స్ దక్కించుకుందని,. గ్లింప్స్‌లో వెంగి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందని, నాకు సహకరించిన టీంకు, మా ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన రాజ్ కందుకూరి, డీఎస్ రావులకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత ఈశ్వర్ (Eswar) మాట్లాడుతూ.. ‘దర్శకుడు సురేష్‌తో ఆరు నెలలుగా ప్రయాణించామని సినిమా అద్భుతంగా వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోందని, సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అన్నారు. ఈ మూవీ తరువాత ఇందులో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని అన్నారు.


విజయ్ శంకర్ (Vijay Shankar) మాట్లాడుతూ.. ‘టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయని, మా టైటిల్ చూసి బోయపాటి శ్రీను గారు పర్సనల్‌గా మెజేజ్ పెట్టారని అన్నారు. సురేష్ గారి ప్యాషన్ ఈ మూవీతో అందరికీ తెలుస్తుందని, గత ఏడు నెలలుగా దర్శక నిర్మాతలు ఈ మూవీ మీదే ఫోకస్ పెట్టారన్నారు. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్ అని వారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానన్నారు. ఆర్జీవీ సినిమాతో ఫేమస్ అయిన అప్సరా రాణి ఇందులో కొత్తగా కనిపిస్తుందన్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు’ అని అన్నారు.

అప్సరా రాణి (Apsara Rani) మాట్లాడుతూ.. ‘చిల్ బ్రోస్ సంస్థ నన్ను ఈ పాత్ర కోసం అప్రోచ్ అయింది. కథ విన్నప్పుడే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్మానని, ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు. రాచరికంతో అరాచకం సృష్టించబోతున్నామ’ని అన్నారు. ఈ చిత్రంలో విజయ్ శంకర్, అప్సరా రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

Updated Date - Dec 18 , 2023 | 06:32 PM