Neha Shetty : ‘టిల్లు’ను కలిసి మాట్లాడమన్నారు!

ABN , First Publish Date - 2023-09-16T20:25:45+05:30 IST

‘డీజే టిల్లు’(Dj Tillu)లో రాధిక పాత్ర, తన హాట్‌నెస్‌తో యువతను ఓ ఊపు ఊపింది నేహాశెట్టి (Neha Shetty). ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంలో కథానాయికగా అవకాశం కోల్పోయింది. ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ (anupama parameswaran) కథానాయికగా నటిస్తోంది.

Neha Shetty : ‘టిల్లు’ను కలిసి మాట్లాడమన్నారు!

‘డీజే టిల్లు’(Dj Tillu)లో రాధిక పాత్ర, తన హాట్‌నెస్‌తో యువతను ఓ ఊపు ఊపింది నేహాశెట్టి (Neha Shetty). ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంలో కథానాయికగా అవకాశం కోల్పోయింది. ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ (anupama parameswaran) కథానాయికగా నటిస్తోంది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకోవడం ఇష్టం ఉండదని చెప్పింది. ‘‘టిల్లు చిత్రంలో రాధికగా ఎంతో గుర్తింపు లభించింది. ‘టిల్లు స్వ్కేర్‌’లో (Tillu Square) నటించకపోవడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. సీక్వెల్‌ విషయంలో మేకర్స్‌ మొదటి నుంచి స్పష్టతతో ఉన్నారు. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కడం లేదు. ఆ కథకు ఇప్పుడు రానున్న కథకు ఎలాంటి సంబంధం లేదు. అందుకే నేను ఈ సినిమాలో భాగం కాలేదు. ‘టిల్లు ేస్క్వర్‌’లో నేను లేకపోవడంతో అభిమానులు కొందరు నిరాశ చెందారు. మీరు ఎందుకు నటించడం లేదు?’, ‘ఆఫీస్‌కు వెళ్లి ఒక్కసారి మాట్లాడండి’, ‘టిల్లు’ను కలిసి మాట్లాడండి’ అని మెసేజ్‌లు చేశారు’ అని చెప్పారు.

కెరీర్‌ గురించి చెబుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలనే ఆశ ఉండేది. మోడలింగ్‌ పూర్తైన వెంటనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. ‘మెహబూబా’ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. ‘డీజే టిల్లు ఆఫర్‌ వచ్చినప్పుడు తప్పకుండా నాకు ఫేమ్‌ వస్తుందని నమ్మా. నా నమ్మకం నిజమైంది’’ అని తెలిపారు. సిద్థు జొన్నలగడ్డ - నేహాశెట్టి నటీనటులుగా గతేడాది విడుదలైన ‘డీజే టిల్లు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా తెరకెక్కుతున్న టిల్లు స్వ్కేర్‌కు దర్శకుడు మారారు. సిద్థు హీరోగా మల్లిక్‌ రామ్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated Date - 2023-09-16T20:26:01+05:30 IST