Meera Jasmine: పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ!

ABN , First Publish Date - 2023-02-15T17:29:34+05:30 IST

‘భద్ర’, ‘గుడుంబా శంకర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ మీరా జాస్మిన్ (Meera Jasmine). కెరీర్ పీక్‌లో ఉండగా పెళ్లి చేసుకున్నారు.

Meera Jasmine: పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ!

‘భద్ర’, ‘గుడుంబా శంకర్‌’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ మీరా జాస్మిన్ (Meera Jasmine). కెరీర్ పీక్‌లో ఉండగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మలయాళీ బ్యూటీ దాదాపుగా పదేళ్ల తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు. శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్‌ను విడుదల చేశారు.

meera.jpg

కొన్ని రోజుల క్రితం మీరా జాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొంటున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి అభిమానులందరు ఆమె ఏ సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర దించుతూ తాజాగా ఆమె నటించే సినిమా పేరు బయటికి వచ్చింది. మీరా జాస్మిన్ ‘విమానం’ (Vimanam)అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. జీ స్టూడియోస్, కేకే క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్నాయి. ‘‘విమానం టీమ్ తరఫున మీరా జాస్మిన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోకి 10ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆమెకు స్వాగతం చెబుతున్నాం’’ అని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మీరా జాస్మిన్ ‘అమ్మాయి బాగుంది’ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. చివరగా ‘మోక్ష’ (Moksha) లో నటించారు. ఈ చిత్రం 2013లో విడుదలైంది. అనంతరం ఏ తెలుగు చిత్రంలోను ఆమె కనిపించలేదు.

Updated Date - 2023-02-15T17:33:45+05:30 IST