Mahesh Shocking post: డాక్టర్‌తో ఫొటో... మహేశ్‌కు ఏమైంది!

ABN , First Publish Date - 2023-04-16T17:00:00+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Super mahesh) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ అభిమానులను కలవరపెడుతుంది. ఆరోగ్యం గురించి ఆయన పెట్టిన పోస్ట్‌తో ఆయనకు ఏమైందంటూ

Mahesh Shocking post: డాక్టర్‌తో ఫొటో... మహేశ్‌కు ఏమైంది!
Mahesh Babu

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Super mahesh) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ అభిమానులను కలవరపెడుతుంది. ఆరోగ్యం గురించి ఆయన పెట్టిన పోస్ట్‌తో ఆయనకు ఏమైందంటూ నెట్టింట చర్చ (Mahesh Viral news) మొదలైంది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో జర్మనీలో ఉన్నారు. అయితే తన ఆరోగ్యానికి సంబంధించి మహేశ్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అభిమానులు షాక్‌ అయ్యేలా చేసింది. డాక్టర్‌ హ్యారీ కోనిగ్‌తో దిగినఓ ఫోటోను షేర్‌ చేసి ‘థ్యాంక్యూ డాక్టర్‌ హ్యారీ కోనిగ్‌! ఆరోగ్యం పట్ల ఉదాసీనత పనికిరాదు. సంరక్షకుడు లేకపోతే ఆరోగ్యం లేదు. జాగ్రత్తగా ఉంటేనే మెరుగైన ఆరోగ్యం మీచేతుల్లో’ అని అర్ధం వచ్చేలా మహేశ్‌ చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇది చూసి మహేశ్‌కు ఏమైంది? ఆయన అస్వస్థతకు గురైతే డాక్టర్‌ హ్యారీ నయం చేశారా అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే భయపడాల్సింది ఏమీ లేదంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. డాక్టర్‌ హ్యారీ కోనిగ్‌ నేచురోపతి వైద్యులు. చాలాకాలంగా ఆయన ఆధ్వర్యంలో మహేశ్‌ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే! (mahesh with doctor)

ప్రస్తుతం త్రివిక్రమ్‌ (Trivikram)దర్శకత్వంలో మహేశ్‌ ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ (SSMB28)చిత్రం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ చేశారు. తాజాగా మహేశ్‌ కుటుంబంతో కలిసి జర్మనీకి టూర్‌కి వెళ్లారు. విహారం పూర్తయిన తర్వాత మళ్లీ ఆయన సెట్‌లో అడుగుపెడతారని తెలుస్తోంది. తదుపరి ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29) చిత్రం చేస్తున్నారు. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ చిత్రాన్ని రాజమౌళి పార్టులుగా తెరకెక్కించనున్నారు, ఇంటర్నేషనల్‌ వైడ్‌ క్రేజ్‌ కోసం హాలీవుడ్‌ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లను రాజమౌళి సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

Updated Date - 2023-04-16T17:05:20+05:30 IST