Mahesh Babu: మహేష్ తల్లి ఇందిరాదేవికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2023-09-28T18:05:05+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఈలోకం విడిచి ఈరోజు సెప్టెంబర్ 28 కి ఒక సంవత్సరం అయింది. ఈరోజు కుటుంబ సభ్యులు అందరూ ఆమెకి నివాళులు అర్పించినట్టుగా తెలిసింది. పద్మాలయ స్టూడియో లో మహేష్ తల్లి దండ్రుల ఫోటోలకి కృష్ణ సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారని తెలిసింది

Mahesh Babu: మహేష్ తల్లి ఇందిరాదేవికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
File picture of Mahesh Babu with his mother Indira Devi

సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) కి గత సంవత్సరం అంటే 2022 అంతా విషాదమే మిగిల్చింది. ఏడాది మొదటి నెలలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు (RameshBabu) చనిపోయారు, తరువాత సెప్టెంబర్ 28 అంటే ఈరోజుకి ఒక సంవత్సరం, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి (IndiraDevi) ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా మహేష్ బాబు కోలుకొని స్థితిలో ఉండగానే, అతని తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారు నవంబర్ 15న కన్నుమూశారు. గత సంవత్సరం అంతా సూపర్ స్టార్ తనకి అత్యంత సన్నిహితులైన తల్లిదండ్రులు, అన్నయ్యని పోగొట్టుకున్నాడు.

adiseshagirirao1.jpg

తన తల్లి ఇందిరా దేవి ఈ లోకం విడిచి వెళ్ళిపోయి ఈరోజుకి అంటే సెప్టెంబర్ 28కి ఒక సంవత్సరం అయింది. ఈరోజు జూబిలీ హిల్స్ లోని పద్మాలయ స్టూడియోలో (PadmalayaStudio) ఇందిరా దేవి, కృష్ణ గారి ఫోటోలకి కుటుంబ సభ్యులు నివాళులు అరిపించినట్టుగా తెలిసింది. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర కూడా కుటుంబ సభ్యులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అరిపించినట్టుగా తెలిసింది. అలాగే నిర్మాత, కృష్ణ గారి సోదరుడు అయిన ఆదిశేషగిరి రావు (AdiseshagiriRao) పద్మాలయ స్టూడియో లో ఇందిరాదేవి, కృష్ణ గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

maheshbabufamily.jpg

మహేష్ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' #GunturKaaram సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) దీనికి దర్శకుడు కాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల చెయ్యాలని చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-09-28T18:05:05+05:30 IST