Guntur Karam: మహేష్ అభిమానులకు శుభవార్త, హమ్మయ్య, సైలెంట్ గా షూటింగ్ ఈరోజు స్టార్ట్ చేశారు

ABN , First Publish Date - 2023-06-24T18:10:16+05:30 IST

మొత్తానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ ఈరోజు మొదలయింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి, రఘుబాబు, వెన్నెల కిశోర్ లాంటి నటులు పాల్గొనగా కాంబినేషన్ సన్నివేశాలు తీసారని, ఇది కొన్ని రోజులు కంటిన్యూ అవుతుందని తెలిసింది.

Guntur Karam: మహేష్ అభిమానులకు శుభవార్త, హమ్మయ్య, సైలెంట్ గా షూటింగ్ ఈరోజు స్టార్ట్ చేశారు
Mahesh Babu in Guntur Karam

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా, మొదలెడతారా అని అందులో నటిస్తున్న చాలామంది క్యారెక్టర్ నటులు, అలాగే మహేష్ బాబు అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైద్రాబాదులో సైలెంట్ గా మొదలెట్టేసారు అని తెలిసింది.

Sreeleela-7.jpg

మహేష్ బాబు, ఇందులో కథానాయకురాలిగా నటిస్తున్న శ్రీలీల (Sreeleela), అలాగే ఇంకో కథానాయకురాలిగా నటిస్తున్న మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary), రఘుబాబు (Raghubabu), వెన్నెల కిషోర్ (VennelaKishore) లు ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు తెలిసింది. వీరందిమీద చాలా కీలకమైన సన్నివేశాలు ఈరోజు ఉదయం నుండి తీసారని కూడా తెలిసింది.

షూటింగ్ కూడా హైద్రాబాద్ లోనే జరుగుతోందని, ఇప్పుడు ఏ హడావిడి లేకుండా తీస్తున్నారని, ఇది కొన్ని రోజులు కంటిన్యూ అవుతుందని కూడా తెలిసింది. జులై మొదటి వారం నుండి మరికొందరు క్యారెక్టర్ నటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని, ఇంకా చాలా కాంబినేషన్ సన్నివేశాలు వుంటాయని కూడా తెలిసింది. ఈ సినిమా నుండి ఇప్పటికే పూజ హెగ్డే తప్పుకున్న సంగతి కూడా తెలిసిందే.

Updated Date - 2023-06-24T18:10:16+05:30 IST