Mahesh - Rajamouli: ఎప్పుడు కలిశారు.. ఎక్కడ కలిశారు!

ABN , First Publish Date - 2023-03-17T18:28:48+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలిసున్న ఫొటో ఒకటి గురువారం ఉదయం నుండి ట్రెండింగ్‌లో ఉంది. ట్విట్టర్‌లో ఈ ఫొటో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Mahesh - Rajamouli: ఎప్పుడు కలిశారు.. ఎక్కడ కలిశారు!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Maheshbabu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలిసున్న ఫొటో ఒకటి గురువారం ఉదయం నుండి ట్రెండింగ్‌లో ఉంది. ట్విట్టర్‌లో ఈ ఫొటో (Mahesh photo viral) విపరీతంగా వైరల్‌ అవుతోంది. బయటికొచ్చిన క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ఫొటో ఎప్పుడు, ఎక్కడా అంటూ నెటిజన్లు సెర్చింగ్‌ మొదలుపెట్టారు మహేశ్‌-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! అందులో భాగంగానే ఇప్పుడీ స్టిల్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇందులో చూస్తే రాజమౌళి - మహేశ్‌ ఆసక్తికరంగా ఏదో మాట్లాడుకుంటునట్లు ఉంది. అది తదుపరి చిత్రం గురించా? లేదా వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారా? అన్న దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

‘ఈ మధ్యనే కలిసిన ఫొటో ఇది’ అని కొందరు అంటుంటే.. ఆస్కార్‌కు వెళ్లడానికి ముందు కలిసిన ఫొటో కావచ్చు అని కొందరు అంటున్నారు. బాక్సాఫీసును షేక్‌ చేేస కాంబో టూ మాన్‌స్టర్స్‌ ఇన్‌ ఫ్రేమ్‌ అంటూ అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకలో పాల్గొనేందుకు లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లిన జక్కన్న శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ గ్యాప్‌లోనే రాజమౌళి, మహేశ్‌ ఎక్కడ కలుసుకున్నారు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 9Rajamouli- Maheshbabu photo viral in net)

ఎస్‌ఎస్‌ఎంబీ 29(SSMB29) టైటిల్‌తో యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే కథగా తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేశ్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అది పూర్తయ్యాక రాజమౌళి చిత్రం మొదలవుతుందని సమాచారం.

Updated Date - 2023-03-17T18:47:42+05:30 IST