Chaitanya Master Mother: ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా’ అని ఒంటరిగా వెళ్లిపోయాడు!

ABN , First Publish Date - 2023-05-01T16:16:37+05:30 IST

‘ఢీ’ షో ఫేం, కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్య సంచలనంగా మారింది. నెల్లూరులో ఓ హోటల్‌ గదిలో ఉరేసుకుని చనిపోయాడు చైతన్య. అప్పుల బాధ తట్టుకోలేకే ఇలా చేస్తున్నానంటూ

Chaitanya  Master Mother: ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా’ అని ఒంటరిగా వెళ్లిపోయాడు!

‘ఢీ’ షో ఫేం(Dhee Fame), కొరియోగ్రాఫర్‌ చైతన్య (Master Chaintanya) ఆత్మహత్య సంచలనంగా మారింది. నెల్లూరులో ఓ హోటల్‌ గదిలో ఉరేసుకుని చనిపోయాడు చైతన్య. అప్పుల బాధ తట్టుకోలేకే ఇలా చేస్తున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అయితే అప్పుల బాధతో తాను చనిపోయాడంటే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. తన మేనమామ సైతం అతడికి అప్పు చేయాల్సిన అవసరం లేదనీ, ఒకవేళ ఉన్నా... పది, ఇరవై వేలు ఉండొచ్చని చెప్పారు. అప్పులు ఉన్నా... తీర్చే స్తోమత కుటుంబానికి ఉందని ఆయన చెప్పారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం స్పందించారు. అప్పుల బాధతో తన బిడ్డ చనిపోయాడనేది అబద్దం అని చెబుతున్నారు. సమస్యల గురించి తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Chaitanya matser emotional speech)

‘‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా కనిపిస్తున్నావ్‌.. కాస్త యాక్టివ్‌గా ఉండు,, ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకో’ అని చెప్పా. సరేనమ్మా అన్నాడు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్‌ చేసుకున్నాడు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అంతు చిక్కడం లేదు. అంతకు ముందే గుడికి వెళ్తాం ఇంటికి రా అంటే నాక్కూడా చిరాగ్గా ఉందమ్మా.. వస్తాను గుడికి వెళ్తాం’ అన్నాడు. ఇప్పుడు నన్ను అన్యాయం చేసి వదిలి వెళ్లిపోయాడు. గతంలో ఓసారి ఫోన్‌ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతాను’ అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్‌ కన్ఫామ్‌ చేయమని అన్నాడు. ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’ అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి రోదిస్తున్నారు. డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యమని తరచూ చెబుతుండేవాడు. ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులు ఉన్నాయనే విషయం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. నా బిడ్డ చేసి పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధ ఎక్కువగా ఉంది’ అని లక్ష్మీ రాజ్యం భావోద్వేగానికి లోనయ్యారు.

Updated Date - 2023-05-01T16:20:43+05:30 IST