Allu Arjun: మామ ఎంఎల్ఏ టికెట్ కోసం అల్లుడు అల్లు అర్జున్ రంగంలోకి...

ABN , First Publish Date - 2023-08-19T13:32:03+05:30 IST

నటుడు అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి ఈసారి బిఆర్ఎస్ పార్టీ తరపున నాగార్జున సాగర్ ఎంఎల్ఏ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలిసింది. అందుకని తన బలం ముఖ్యమంత్రికి చూపించటం కోసం ఈరోజు కంచర్ల కన్వెన్షన్ ప్లేస్ కట్టి దానికి తన అల్లుడు అల్లు అర్జున్ చేత ఓపెన్ చేయించారు. వేలకొద్దీ అల్లు అర్జున్ అభిమానులు తరలి వచ్చారు...

Allu Arjun: మామ ఎంఎల్ఏ టికెట్ కోసం అల్లుడు అల్లు అర్జున్ రంగంలోకి...
Allu Arjun at Kancharla Convention Place opening at Nalgonda

గత కొన్ని రోజుల నుండి నల్గొండ (Nalgonda) జిల్లాలో అల్లు అర్జున్ (AlluArjun) కట్ అవుట్ లు విపరీతంగా పెట్టారు. అతను కంచర్ల కన్వెన్షన్ ప్లేస్ (KancharlaConventionPlace) ఓపెన్ చెయ్యడానికి వస్తున్నాడు అని బాగా ప్రచారం కూడా చేశారు. ఇంతకీ ఆ కన్వెన్షన్ హాల్ కట్టింది ఎవరంటే, స్వయానా అల్లు అర్జున్ కి మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (KChandrasekharReddy), బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన వ్యక్తి. అయితే ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో వున్నారని, అందుకే తన బలం చూపించుకోవడానికే ఈ కన్వెన్షన్ హాల్ కట్టి, దానికి తన అల్లుడు అల్లు అర్జున్ ని పిలిచి ఓపెన్ చేయించారని ఒక టాక్ నడుస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనని నాగార్జున సాగర్ (NagarjunaSagar) నియోజక వర్గం నుండి పోటీ చెయ్యమంటే తాను పోటీ చెయ్యడానికి సిద్ధం అని చంద్రశేఖర్ రెడ్డి ఇంతకు ముందే చెప్పారు. అయితే ఇప్పుడు మరొకసారి తన వెనక తన అల్లుడు వున్నాడు, అతనికి విపరీతమైన అభిమానులు వున్నారు, వాళ్ళు తనకే ఓటు వేస్తారని అది చూపించడానికే ఈ కన్వెన్షన్ హాల్ కట్టి ఓపెన్ చెయ్యడానికి అల్లు అర్జున్ ని పిలిపించుకున్నాడు అని తెలుస్తోంది.

alluarjun-nalgonda1.jpg

అయితే అల్లు అర్జున్ ఈ హాల్ ఓపెన్ చేసాడు, కానీ రాజకీయంగా ఏమీ మాట్లాడలేదు. తన మామగారు కె చంద్రశేఖర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ప్రజలకు మంచి చెయ్యాలని ఈ కన్వెన్షన్ హాల్ కట్టారు, అది ఈ వూరికి ఉపయోగపడుతుంది, అందుకు మా మామగారిని అభినందిస్తున్నాను అని చెప్పాడు అల్లు అర్జున్. ఈ ఫంక్షన్ ని ఇంత సక్సెస్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి అభిమానులను, అలాగే తన ఆర్మీకి థాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. అయితే ఒకవేళ చంద్రశేఖర్ రెడ్డి కి టికెట్ ఇస్తే కనక, అల్లు అర్జున్ తన మామ కోసం ప్రచారం చేయొచ్చు అనే టాక్ కూడా వుంది.

అల్లు అర్జున్ కట్ ఔట్స్ తో పాటు, బీఆర్ఎస్ పార్టీ జెండాలు, కెటిఆర్ కట్ ఔట్స్ కూడా ఈ సభలో బాగా కనిపించాయి. అల్లు అర్జున్ ని చూడటానికి అతని అభిమానులు విపరీతంగా వచ్చారు. అల్లు అర్జున్ కుటుంబం తో సహా ఈ వూరికి వచ్చాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' #Pushpa2 షూటింగ్ లో బిజీ గా వున్నాడు. సుకుమార్ (Sukumar) దీనికి దర్శకుడు, రష్మిక మందన్న (RashmikaMandanna) కథానాయకురాలు.

Updated Date - 2023-08-19T13:32:03+05:30 IST