Allu Arjun: నాన్న ఆ డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు!

ABN , Publish Date - Dec 25 , 2023 | 10:30 AM

తన తండ్రి, టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అరవింద్‌ ఓ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని ఐకానస్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. సమయం వచ్చిన ప్రతిసారీ బన్ని తన తండ్రి గొప్పతనాన్ని చాటి చెబుతుంటారు. అప్పుడప్పుడు ఇలా ఆట పట్టిస్తుంటారు కూడా. ఈ మేరకు ఇనస్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. అసలు సంగతి ఏంటంటే...

Allu Arjun: నాన్న ఆ డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు!

తన తండ్రి, టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అరవింద్‌ ఓ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని ఐకానస్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. సమయం వచ్చిన ప్రతిసారీ బన్ని తన తండ్రి గొప్పతనాన్ని చాటి చెబుతుంటారు. అప్పుడప్పుడు ఇలా ఆట పట్టిస్తుంటారు కూడా. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. అసలు సంగతి ఏంటంటే... చిరంజీవి హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘విజేత’లో బన్నీ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఆ చిత్రంతోనే బన్ని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మించారు. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘మా నాన్న నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు’ అని పోస్ట్‌ పెట్టారు. దానికి స్మైలీ ఎమోజీ జోడించారు. ఆయన షేర్‌ చేసిన ఫొటోలో.. ‘విజేత’ 100 రోజుల జ్ఞాపికతోపాటు అల్లు అరవింద్‌ నవ్వుతూ కనిపించారు.ప్రస్తుతం బన్నీ పోస్ట్‌ చేసిన పిక్‌ వైరల్‌ అవుతోంది.

Allu aravind.jpg

అల్లు అర్జున్  చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, విజేత, స్వాతిముత్యం చిత్రాల్లో కనిపించారు. తర్వాత డాడీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం.. అల్లు అర్జున్  ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నారు బన్నీ. బాక్సాఫీసును షేక్‌ చేసి పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్‌లో ఆడిన ‘పుష్ప’కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నటనకుగానూ బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు. ఓ పక్క పుష్ప సక్సెస్‌, మరోపక్క నేషనల్‌ అవార్డు ఈ రెండింటితో పుష్ప-2పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకునేలా దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated Date - Dec 25 , 2023 | 02:08 PM