Ajay Bhupati - Mangalavaram: ఈసారి పక్కా ప్రణాళికతో...

ABN , First Publish Date - 2023-07-20T19:14:15+05:30 IST

ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం సక్సెస్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్‌ భూపతి. బోల్డ్‌ లవ్‌స్టోరీతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యి వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. మొదటి సినిమా పెద్ద హిట్‌ అయినా రెండో చిత్రం తెరపైకి రావడానికి మూడేళ్లు సమయం తీసుకున్నారు అజయ్‌ భూపతి.

Ajay Bhupati - Mangalavaram: ఈసారి పక్కా ప్రణాళికతో...

‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX100) చిత్రం సక్సెస్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్‌ భూపతి(Ajay bhupathi). బోల్డ్‌ లవ్‌స్టోరీతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయ్యి వసూళ్ల వర్షం కురిపించింది. చిన్న చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. మొదటి సినిమా పెద్ద హిట్‌ అయినా రెండో చిత్రం తెరపైకి రావడానికి మూడేళ్లు సమయం తీసుకున్నారు అజయ్‌ భూపతి. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘మహా సముద్రం’. ఆర్‌ఎక్స్‌ 100 సక్సెస్‌తో ఈ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉంటుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. అయితే ‘మహాసముద్రం’ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది.

అయితే ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పరిచయం చేశారు అజయ్‌. ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్‌, రొమాన్స్‌, షాకింగ్‌ ట్విస్ట్‌లు కలిపి కల్ట్‌ సినిమా చూపించారు. ‘మహాసముద్రం’లో యాక్షన్‌ డోస్‌ మరింత పెంచారు. ఆ రెండు సినిమాల తర్వాత అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajputh) ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మహాసముద్రం’ వచ్చిన రెండేళ్ల తర్వాత అజయ్‌ నుంచి వస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఆకట్టుకున్నారు. పచ్చటి తోటలు.. వాటి మధ్యలో ఊరు... ఊరి మధ్య అమ్మవారి గుడి, వందల మంది ప్రజలు, పచ్చని పొలాలు, ప్రజల కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన భయం, ఆఖరికి మూగ జంతువుల కళ్ళలో కూడా భయం? అందుకు కారణం ఏంటి అన్న థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో అజయ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. అయితే ఈ చిత్రంపై దర్శకుడు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పట్ల ఆయన ఎంతగా నమ్మకంగా ఉన్నారో ట్విట్టర్‌లో తాజా ట్వీట్‌ చూస్తే అర్శమవుతోంది. గన్‌ పట్టుకుని గురిపెట్టిన ఫొటో పోస్ట్‌ చేసి ‘ఈసారి గురి తప్పన్విను’ అని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అంటే ఈ సినిమాపై దర్శకుడిగా ఆయనకు ఎంత నమ్మరం ఉందో తెలుస్తోంది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-07-20T19:14:15+05:30 IST