SSMB28: కొన్ని రోజుల క్రితం శ్రీలీలతో, ఇప్పుడు పూజ హెగ్డే తో...

ABN , First Publish Date - 2023-03-21T12:05:23+05:30 IST

కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు, శ్రీలీల మీద సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇప్పుడు సారధి స్టూడియోలో ఇంకో కథానాయకురాలితో...

SSMB28: కొన్ని రోజుల క్రితం శ్రీలీలతో, ఇప్పుడు పూజ హెగ్డే తో...

మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో చేస్తున్న SSMB28 సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా అవుతోంది అని అంటున్నారు. ఎక్కడా ఎటువంటి హడావిడి లేకుండా షూటింగ్ సైలెంట్ గా చేసుకుంటూ వెళుతున్నారని తెలిసింది. ఆమధ్య మహేష్ బాబు, శ్రీ లీల (Sreeleela) మీద కొన్ని సన్నివేశాలు హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్ లో తీసారని తెలిసింది. ఈ సన్నివేశాలు అన్నీ చాలా హైలైట్ గా వుంటాయని కూడా అంటున్నారు. ఇక్కడ తీసిన సన్నివేశాల్లో మహేష్ బాబు (SSMB28) మళ్ళీ లుంగీ కట్టుకొని కనిపించే అవకాశం వుంది అని కూడా అంటున్నారు.

poojahegde-ssmb28.jpg

అదలా ఉంటే, అప్పుడు శ్రీలీల తో రొమాన్స్ సఞ్ఞవేశాలు అయిపోయాక, ఇప్పుడు మహేష్ బాబు, పూజ హెగ్డే (Pooja Hegde) మీద రొమాన్స్ సన్నివేశాలు తీస్తున్నట్టుగా తెలిసింది. దీని కోసమని సారధి స్టూడియో (Saradhi Studio) లో ఒక సెట్ వేశారని, అందులో మహేష్, పూజ హెగ్డే అలాగే మరికొంతమంది నటులు పాల్గొనగా వారి మీద సన్నివేశాలు తీస్తున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా ఇంతకు ముందు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలతో పోలిస్తే కొంచెం తొందరగానే అవుతున్నట్టుగా చెప్తున్నారు. అలాగే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాని తొందరగానే అనుకున్న తేదీకి పూర్తి చెయ్యాలని కూడా అనుకుంటున్నట్టుగా తెలిసింది.

sreeleela4.jpg

ఒకవేళ తొందరగా అయిపోతే ఈ సినిమా సమ్మర్ కి వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా త్రివిక్రమ్ తీసిన ఒక 'అతడు' (Athadu), ఒక 'అత్తగారింటికి దారేది' (Atharintiki Daredi) లా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంతవరకు సినిమా అయితే బాగానే వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రాముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారని, ఇందులో చాలామంది నటులు, ఇంచుమించు తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమలో నుండి నటులు ఉంటారని తెలుస్తోంది.

Updated Date - 2023-03-21T12:05:24+05:30 IST