Advocate Arun Kumar: నాగార్జునను అరెస్ట్‌ చేయాలంటూ ఫిర్యాదు! 

ABN , Publish Date - Dec 19 , 2023 | 10:11 PM

బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున(Nagarjuna) షో నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బిగ్‌బాస్‌ (Biggboss) పేరుతో అక్రమంగా 100 రోజులపాటు కంటెస్టెంట్‌లను నిర్భందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్  వేశారు

Advocate Arun Kumar: నాగార్జునను అరెస్ట్‌ చేయాలంటూ ఫిర్యాదు! 

బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున(Nagarjuna) షో నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బిగ్‌బాస్‌ (Biggboss) పేరుతో అక్రమంగా 100 రోజులపాటు కంటెస్టెంట్‌లను నిర్భందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్  వేశారు. బిగ్‌బాస్‌ పోటీలో ఉన్న వారిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే విషయం పై మహిళ కమిషన్‌ ఛైర్మన్ కి  కూడా ఫిర్యాదు చేస్తామని పిటీషనర్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వెనకున్న కుట్రను బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు. 

బిగ్‌బాస్‌ సీజన్ 7 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం జరిగింది. రైతుబిడ్డకు బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్  బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని విజేతగా నిలిచాడు. షో పూర్తై బయటకు రాగానే అభిమానులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ , అమర్‌దీప్‌, ఇతర ఇంటి సభ్యుల అభిమానుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పల్లవి ప్రశాంత్  అభిమానులు అమర్‌దీప్‌, అశ్వినీ కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా ఒక ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. ఆర్‌టీసీపై దాడి అంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి వాటిని ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదు’’ అని హెచ్చరించారు. 


Updated Date - Dec 19 , 2023 | 10:11 PM