రోజుకి 48 గంటలు
ABN , First Publish Date - 2023-07-14T23:06:42+05:30 IST
ఆదిత్య, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘ఒక్క రోజు.. 48 గంటలు’. నిరంజన్ దర్శకుడు. కిరణ్ కుమార్ రెడ్డి నిర్మాత.....
ఆదిత్య, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘ఒక్క రోజు.. 48 గంటలు’. నిరంజన్ దర్శకుడు. కిరణ్ కుమార్ రెడ్డి నిర్మాత. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘రోజుకి 24 గంటలే. కానీ మా సినిమాలో 48 గంటలు. అదెలాగో సినిమా చూసి తెలుసుకోవాలి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథ ఇది. త్వరలోనే సి.కల్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ ఆవిష్కరిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.