Nayanathara-Vignesh: ఫొటో పెట్టారు కానీ... ఈ సారి కూడా...!

ABN , First Publish Date - 2023-03-20T16:16:12+05:30 IST

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రస్తుతం తన ఇద్దరి బిడ్డలతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ప్రియుడు విష్నేశ్‌ శివన్‌ను పెళ్లాడిన నయన్‌ సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు.

Nayanathara-Vignesh: ఫొటో పెట్టారు కానీ... ఈ సారి కూడా...!

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (Nayanathara) ప్రస్తుతం తన ఇద్దరి బిడ్డలతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ప్రియుడు విష్నేశ్‌ (Vignesh Shivan) శివన్‌ను పెళ్లాడిన నయన్‌ సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు. బిడ్డలిద్దరికీ ఉయిర్‌, ఉలగం అని పేర్లు పెట్టారు. అన్ని నిబంధనల ప్రకారమే ఈ జంట సరోగసీకి వెళ్లినా ఈ వ్యవహరం వివాదం మారింది. తర్వాత ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది. తనకు పిల్లలు పుట్టి నెలలు గడుస్తున్నా... నయన్‌ వారిని ముఖాలను ఇంకా బయటకు రానివ్వలేదు. నయన్‌ అభిమానులు మాత్రం ఆమె పిల్లల్ని చూడాలని ఆసక్తి చూపుతున్నారు. నెట్టింట పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా విఘ్నేశ్‌ ఆ చిన్నారుల క్యూట్‌ ఫొటోలను (Kids Cute photos) షేర్‌ చేశాడు. అయితే ఈసారి కూడా ముఖం కనిపించకుండ జాగ్రత్త పడ్డాడు. దీంతో నెటిజన్లు మరోసారి వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా పిల్లల్ని చూపించకుండా దాచిపెడతారు’ అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఆ చిన్నారుల చేతులు పట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్‌ చేసి ‘ఆనందం అనేది మన ప్రియమైన వారితోనే ముడిపడి ఉంటుంది. ప్రేమ అంటేనే ఆనందం.. ఆనందం అంటే ప్రేమ’ అంటూ విఘ్నేశ్‌ రాసుకొచ్చారు. తాజాగా ఈ స్టార్‌ కపుల్స్‌ కవలలతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. మీడియా కెమెరాలకు పని చెప్పింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-03-20T16:28:19+05:30 IST