సమాజాన్ని మేల్కొలిపేలా..
ABN , First Publish Date - 2023-03-25T02:39:05+05:30 IST
స్వాతి విఘ్నేశ్వరి, అల్లు రమేశ్, రోహిణి కీర్తి, రాజా, బద్రీనాథ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘సత్యం వధ.. ధర్మం చర’. బాబు నిమ్మగడ్డ దర్శకుడు. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈనెల 31న విడుదల...
స్వాతి విఘ్నేశ్వరి, అల్లు రమేశ్, రోహిణి కీర్తి, రాజా, బద్రీనాథ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘సత్యం వధ.. ధర్మం చర’. బాబు నిమ్మగడ్డ దర్శకుడు. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈనెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిన్నపిల్లల్ని నిద్రబుచ్చడానికి కథలు చెబుతుంటాం. అలాగే పెద్ద మనుషుల్ని మేల్కొలపడానికి కొన్ని కథలు చెప్పాలి. ‘సత్యం వధ.. ధర్మం చర’ అలాంటి కథే. సమాజంలో జరిగిన, జరుగుతున్న కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం ఇద’’న్నారు.