టీజర్ చూసిన పవన్
ABN , First Publish Date - 2023-03-01T01:13:50+05:30 IST
సాయిధరమ్తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తిక్ దండు దర్శకత్వంలో బీవీఎ్సఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు...
సాయిధరమ్తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తిక్ దండు దర్శకత్వంలో బీవీఎ్సఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. ఏప్రిల్ 21న తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలవుతోంది. బుధవారం టీజర్ను విడుదల చేయనున్నారు. మంగళవారం టీజర్ను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా వీక్షించారు. టీజర్ ఆసక్తికరంగా ఉందని ఆయన అభినందించారు. ఇప్పటివరకూ తేజ్ చేసిన చిత్రాలకు భిన్నంగా ‘విరూపాక్ష’ ఉంటుందని నిర్మాత తెలిపారు.