ఓ చందమామ కథలా...
ABN , First Publish Date - 2023-02-10T00:12:34+05:30 IST
పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో ఉపేంద్ర కంచర్ల కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కంచర్ల అత్యుత్ రావు నిర్మాత. ఈ చిత్రానికి ‘అనగనగా కథలా’ అనే పేరు...
పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో ఉపేంద్ర కంచర్ల కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కంచర్ల అత్యుత్ రావు నిర్మాత. ఈ చిత్రానికి ‘అనగనగా కథలా’ అనే పేరు ఖరారు చేశారు. శుభశ్రీ, నేహాదేశ్ పాండే కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. సస్పెన్స్, థిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం సాగుతుందని, ఓ చందమామ కథలా.. అందరినీ ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు వస్తుందన్న నమ్మకం ఉందని ఉపేంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.