ధైర్యానికి అదృష్టం తోడైతే...
ABN , First Publish Date - 2023-01-27T04:48:50+05:30 IST
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రధారులుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది...
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రధారులుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎస్.ఎన్.రెడ్డి, బాల సుందరం, దినేశ్ సుందరం నిర్మాతలు. ఈ చిత్రానికి ‘జీబ్రా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఉపశీర్షిక. ప్రియా భవానీ శంకర్, జెనిఫర్ పిచినెటో కథానాయికలు. సత్యరాజ్ కీలక పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాసల్లో ఒకేసారి విడుదల అవుతుంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, కొలకొత్తా, ముంబై తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. ‘‘కథకు తగిన టైటిల్ ఇది. కథ, కథనాలు చదరంగం ఆటని పోలి ఉంటాయి. ఏ ఆటలో అయినా గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. ధైర్యానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్ర అలా ఉంటుంద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: రవి బస్రూర్.