Akasam Dati Vastava : హీరోగా మారిన కొరియోగ్రాఫర్
ABN , First Publish Date - 2023-07-25T03:09:58+05:30 IST
ప్రభుదేవా, లారెన్స్, జానీ మాస్టర్.. ఇలా హీరోలైన కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ యశ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. ‘బలగం’ చిత్రం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ బేనర్పై నిర్మించే రెండో చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’
ప్రభుదేవా, లారెన్స్, జానీ మాస్టర్.. ఇలా హీరోలైన కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ యశ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు దిల్ రాజు. ‘బలగం’ చిత్రం తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ బేనర్పై నిర్మించే రెండో చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’ వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వెల్లడించారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఇదొక మ్యూజికల్ మూవీ. దర్శకుడి జీవితం నుంచి ఈ కథ తయారైంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘జీవితంలో అన్ని బంధాలకు ప్రేమ, సమయం, డబ్బు సమానంగా పంచి ఇవ్వాలి. ఆ మూడింటిలో ఏది తగ్గినా గొడవలు మొదలవుతాయి. ఆ పాయింట్తోనే కథ తయారైంది’ అన్నారు. ‘ఇదంతా నాకు ఓ కలలా ఉంది. దిల్ రాజుగారి నుంచి ఫోన్ రాగానే ఆయన సినిమాలో కొరియోగ్రఫీ చేయాలేమోనని వెళ్లాను. కానీ హీరో నువ్వేనని చెప్పగానే షాక్ అయ్యాను. ఈ సినిమా నుంచి ఎన్నో నేర్చుకున్నాను’ అన్నారు యశ్.