Sushant Singh Rajput : సూసైడ్‌ గురించి ఏం చెప్పిందంటే.. !

ABN , First Publish Date - 2023-10-07T15:58:22+05:30 IST

బాలీవుడ్‌ నటుడు  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్‌ ఓ సంచలనం. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయసి రియా చక్రవర్తి కారణం అని సుశాంత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది.

Sushant Singh Rajput : సూసైడ్‌ గురించి ఏం చెప్పిందంటే.. !

బాలీవుడ్‌ నటుడు  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్‌ ఓ సంచలనం. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. సుశాంత మరణానికి అతని ప్రేయసి రియా చక్రవర్తి కారణం అని సుశాంత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె బెయిల్‌ మీద బయటికొచ్చింది. కెరీర్‌ పరంగా బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Untitled-1.gif

రియా మాట్లాడుతూ '‘సుశాంత్‌ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలుసు. తను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నాకు తెలుసు. సుశాంత్‌ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన లైఫ్‌ మారిపోయింది. అయితే అతను అంతకుముందే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు. అందువల్ల అతన్ని కంట్రోల్‌ చేసే ప్రయత్నం నేనేప్పుడూ చేయలేదు. నేను అలాంటి మనిషిని కాదు. సుశాంత్‌కు డ్రగ్స్‌ సరఫరా చేశారా? అన్న ప్రశ్నకు ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు అని సమాధానమిచ్చింది.

Updated Date - 2023-10-07T15:58:22+05:30 IST