Aaradhya bachchan: బిగ్‌బీ మనవరాలు ఏం చేసిందంటే!

ABN , First Publish Date - 2023-04-20T16:46:46+05:30 IST

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌, ఐశ్వర్యారాయ్‌ గారాలపట్టీ ఆరాధ్య బచ్చన్‌ హైకోర్టును ఆశ్రయించింది.

Aaradhya bachchan: బిగ్‌బీ మనవరాలు ఏం చేసిందంటే!

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) మనవరాలు, అభిషేక్‌, ఐశ్వర్యారాయ్‌ గారాలపట్టీ ఆరాధ్య బచ్చన్‌(Aaradhya bachchan) హైకోర్టును ఆశ్రయించింది. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు వ్యూవర్‌షిప్‌ కోసం ఆరాధ్య ఆరోగ్యంపై రూమర్స్‌ (Fire on Rumours) క్రియేట్‌ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దీంతో ఢిల్లీ హైకోర్టును (Delhi Highcourt) ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ యూట్యూబ్‌ చానళ్ల పై ఆమె ఫిర్యాదు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై కల్పిత వార్తలు రాసి, వీడియోలు చేసిన వారిపై చర్చలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడీ వార్త బాలీవుడ్‌లో చర్చనీయాశంగా మారింది.

అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్స్‌లో కనిపించే ఆరాఽధ్యను గురించి ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ‘ఆమె అసలు స్కూల్‌కు వెళ్లదా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. దీనిపై అభిషేక్‌ బచ్చన్‌ ఓ వేదికపై మాట్లాడారు. ‘‘మా కుటుంబానికి సినీ నేపథ్యం ఉండొచ్చు. కానీ, నా కూతురు ఆరాధ్యకు ఈ రంగంతో సంబంధం లేదు. ఆమె చదువుకుంటుంది. పిల్లలు, సెలబ్రిటీల పిల్లలపై ఇలాంటి ట్రోలింగ్‌లను అసలు సహించకూడదు. అసత్య ప్రచారాలు చేసేవారిని క్షమించాల్సిన అవసరం లేదు. అయినా తనపై ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. మీడియా నాతో ఏమైనా చెప్పాలనుకుంటే ప్రత్యక్షంగా మాట్లాడండి. ఇలా వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు’’ అని హెచ్చరించారు.

Updated Date - 2023-04-20T16:46:46+05:30 IST