క్షేమంగా ఇంటికి

ABN , First Publish Date - 2021-10-17T06:41:46+05:30 IST

సాయి తేజ్‌ క్షేమంగా ఇంటికొచ్చారని మెగా కుటుంబం తెలియజేసింది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఫిల్మ్‌ నగర్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే....

క్షేమంగా ఇంటికి

సాయి తేజ్‌ క్షేమంగా ఇంటికొచ్చారని మెగా కుటుంబం తెలియజేసింది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఫిల్మ్‌ నగర్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి శనివారం సాయి తేజ్‌ డిశ్చార్జి అయ్యారు. అదే రోజు ఆయన పుట్టినరోజు, విజయదశమి. ‘‘ప్రమాదం నుంచి సాయి తేజ్‌ పూర్తిగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరడం మా కుటుంబం అంతటికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అని చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. అలాగే, అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-10-17T06:41:46+05:30 IST