‘పుష్ప’కి పోటీగా ఎర్రచందనం అంటోన్న ‘అడవి దొంగ’
ABN , First Publish Date - 2021-11-18T22:05:36+05:30 IST
ఎర్రచందనం బ్యాక్డ్రాప్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదే ఎర్రచందనం

ఎర్రచందనం బ్యాక్డ్రాప్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదే ఎర్రచందనం బ్యాక్డ్రాప్లో ‘అడవి దొంగ’ అనే మరో చిత్రం తెరకెక్కుతోంది. పర్నిక ఆర్ట్స్ బ్యానర్పై రామ్తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్ని గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు వీరశంకర్, నిర్మాత ఆరా మస్తాన్లు ట్రైలర్ను విడుదల చేసి చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ.. ‘‘ఫారెస్ట్, ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అన్ని కమర్షియల్ హంగులతో, రియాలిటీకి దగ్గరగా చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అందరూ ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..’’ అని తెలుపగా హీరో రామ్తేజ్ మాట్లాడుతూ.. ‘‘అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు. ఒకానొక దశలో షూట్లో నా కాలు విరిగిపోయింది. అయినా సరే డైరెక్టర్ పని చేయించాడు. ఆయన పని రాక్షసుడు. ఆయన అలా ఉంటాడు కాబట్టే.. సినిమా చాలా రిచ్గా వచ్చింది. ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ విడుదల చేసి.. మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ముందు ఈ సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమా, చిన్న టీమ్ సరిపోతుంది అనుకున్నాం. కానీ ఇందులో నటించిన వారు, సాంకేతిక నిపుణులందరూ పెద్దగా వర్క్ చేసి పెద్ద సినిమాని చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కసిగా పని చేశారు. మంచి అవుట్ఫుట్ ఇచ్చారు. రేపు థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతారు. అంత న్యాచురల్గా ఈ సినిమా వచ్చింది. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే చిత్ర విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.
అయితే ఈ చిత్ర వివరాలు బయటికి వచ్చినప్పటి నుండి, అలాగే ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ‘పుష్ప’కి పోటీగా ఎర్రచందనం కోసం ‘అడవి దొంగ’ వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుండటం గమనార్హం.
