ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ బాబు కన్నుమూత
ABN , First Publish Date - 2020-08-14T01:57:15+05:30 IST
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50కి పైగా సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, పలు చిత్రాలకు మేనేజర్గా పని చేసిన బండారు ప్రసాద్ బాబు(57) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్లోని
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50కి పైగా సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, పలు చిత్రాలకు మేనేజర్గా పని చేసిన బండారు ప్రసాద్ బాబు(57) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్లోని సన్ షైన్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య అంజలి, వినయ్ కుమార్, మురళీమోహన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసాద్ బాబు మృతి పట్ల సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.