మహేష్‌ బాబు భార్య ‘మెంటల్‌ హెల్త్ ఛాలెంజ్’‌.. అదిరింది

ABN , First Publish Date - 2020-10-11T00:48:20+05:30 IST

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్టార్ట్ చేసిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఇప్పటికే

మహేష్‌ బాబు భార్య ‘మెంటల్‌ హెల్త్ ఛాలెంజ్’‌.. అదిరింది

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్టార్ట్ చేసిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఇప్పటికే దేశ వ్యాప్త గుర్తింపుతో దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరూ ఇందులో భాగం అవుతున్నారు. ఆ తర్వాత కూడా 'బీ ద రియల్‌ మ్యాన్‌', 'గ్రో విత్‌ మీ' అంటూ మరికొన్ని ఛాలెంజ్‌లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. ఇప్పుడు సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ మరో సూపర్బ్ ఛాలెంజ్‌ను సోషల్‌ మీడియా ద్వారా రివీల్‌ చేశారు. ఈ ఛాలెంజ్‌ పేరు '30 డే మెంటల్‌ హెల్త్ ఛాలెంజ్‌'. ఈ ఛాలెంజ్‌లో ఆమె రివీల్‌ చేసిన విషయాలు చూస్తే.. అందరూ వావ్‌ అనక మానరు. అంత చక్కగా 30 డేస్‌ని ఆమె ప్లాన్‌ చేశారు.


ఈ వైరస్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందులో ఇంటి నుంచి పని చేయడం, కంప్యూటర్‌కే ఎక్కువ సమయం కేటాయించడం, వ్యాయామం లేకపోవడం, మొబైల్‌ వినియోగం.. వీటితో మానసిక క్షోభను అనుభవిస్తున్నాం తప్ప.. మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. మానసిక ఆరోగ్యం మన శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమని అందరూ గమనించాలి. అందుకే నేను ఈ 30 రోజుల ప్రణాళికను రూపొందించుకున్నాను. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి.. మీకు ఎంత వరకు ఇది హెల్ప్‌ అయ్యిందో చెప్పండి.. అంటూ నమ్రత 30 రోజుల చాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు అదిరింది మేడమ్‌ అంటూ.. కామెంట్స్‌ చేస్తున్నారు.



Updated Date - 2020-10-11T00:48:20+05:30 IST