చిత్ర పరిశ్రమ బహుముఖ మేధావిని కోల్పోయింది: చిరంజీవి
ABN , First Publish Date - 2020-07-29T01:26:54+05:30 IST
ప్రముఖ నటులు, రచయిత, జర్నలిస్ట్, ప్రయోక్త రావి కొండలరావుగారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా పరిచయం అయిన
ప్రముఖ నటులు, రచయిత, జర్నలిస్ట్, ప్రయోక్త రావి కొండలరావుగారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళనుండి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించడం జరిగిందని.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాదు గొప్ప రచయితను, పాత్రికేయున్ని, ప్రయోక్తను కోల్పోయిందని ఆయన అన్నారు.
‘‘ప్రముఖ నటులు, రచయిత, జర్నలిస్ట్, ప్రయోక్త రావి కొండలరావుగారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో రావి కొండలరావుగారికి సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళనుండి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించడం జరిగింది. ముఖ్యంగా మా కాంబినేషన్లో వచ్చిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు వంటి చిత్రాలలో రావి కొండలరావుగారు చాలా కీలక పాత్రలు పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాదు గొప్ప రచయితను పాత్రికేయున్ని ప్రయోక్తను కోల్పోయింది. అలాగే నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా రావికొండలరావుగారి మరణం ఒక తీరని లోటు. రావి కొండలరావుగారూ ఆయన సతీమణి రాధా కుమారిగారు జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగ వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది. అలాంటి రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని చిరంజీవి పేర్కొన్నారు.