SSMB 29 - Vijayendra Prasad: అవును నిజమే.. ఇంకా ఎవరినీ అనుకోలేదు. !

ABN , First Publish Date - 2023-08-24T14:33:51+05:30 IST

మహేశ్‌ బాబు (Mahesh Babu)- హీరోగా రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB 29) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ ఇద్దరి కాంబినేషన్‌ గురించి సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా గురించి ఏదో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెడుతుంటారు. తాజాగా ఆయనొక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

SSMB 29 - Vijayendra Prasad: అవును నిజమే.. ఇంకా ఎవరినీ అనుకోలేదు. !

మహేశ్‌ బాబు (Mahesh Babu)- హీరోగా రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB 29) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ ఇద్దరి కాంబినేషన్‌ గురించి సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా గురించి ఏదో ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెడుతుంటారు. తాజాగా ఆయనొక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దాంతో అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం పెరిగింది. ఈ చిత్రంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ అగ్రతారలతోపాటు హాలీవుడ్‌ యాక్టర్స్‌ కూడా నటిస్తారని మొదటి నుంచి వార్తలొస్తున్నాయి. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్‌ను తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. Hollywood Actors For SSMB29)

‘‘మహేశ్‌-రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌ నటీనటులు నటించే అవకాశం ఉంది. కథకు తగ్గట్టు అక్కడి యాక్టర్స్‌లు కూడా భాగం కావాల్సిన అవసరం ఉంది. అయితే, ఇంకా ఎవరినీ సంప్రదించలేదు. ఇది ఆఫ్రికాలో సాగే యాక్షన్‌ అడ్వెంచర్స్‌ సినిమా. ఇంతకు మించి ఎక్కువ అప్‌డేట్స్‌ ఇప్పుడే చెప్పడం కరెక్ట్‌ కాదు. సినిమా ప్రారంభం అయ్యాక ఒక్కొక్క విషయం మీకే తెలుస్తుంది’’ అని అన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఇటీవల ఓ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోందని, గ్లోబల్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌లో ఉందని జక్కన్న చెప్పారు. ప్రస్తుతం మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది.

Updated Date - 2023-08-24T14:33:51+05:30 IST